Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫుట్‌బాల్ దిగ్గజం శ్యామ్ థాపాకు కరోనా

ఫుట్‌బాల్ దిగ్గజం శ్యామ్ థాపాకు కరోనా
, బుధవారం, 7 ఏప్రియల్ 2021 (16:32 IST)
భారత ఫుట్‌బాల్ దిగ్గజం, ఆలిండియా ఫుడ్‌బాల్ ఫెడరేషన్ సాంకేతిక విభాగం చైర్మన్ శ్యామ్ థాపా కరోనా బారిన పడ్డారు. తనకు సోమవారం కొవిడ్-19 పాజిటివ్ అని తేలిందనీ... నిన్న సాయంత్రం స్వయంగా ఆస్పత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యానని ఆయన వెల్లడించారు.

''నాకు రుచి తెలియడం లేదు. ఆకలి కూడా మందగించింది. కరోనా టెస్ట్ చేయించడంతో పాజిటివ్ అని తెలిసింది. ముందస్తు జాగ్రత్తగా ఆస్పత్రిలో చేరాను. ప్రస్తుతం నా పరిస్థితి బాగానే ఉంది...'' అని థాపా వెల్లడించారు. కాగా థాపా గత నెల 20న కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. 73 ఏళ్ల ఆయన బైసైకిల్ కిక్, బ్యాక్ వ్యాలీలతో ప్రఖ్యాతి చెందారు. 
 
1960ల్లోనూ, 70వ దశకం మొదట్లోనూ ఈస్ట్ బెంగాల్ తరుపున ఆడారు. 1977లో మొహున్ బేగన్ తరుపున ఆడారు. 1970లో మెర్డెకా టోర్నమెంట్, బ్యాంకాక్ ఏసియన్ గేమ్స్‌లో భారత్‌కు కాంస్య పతకం గెలుచుకునేందుకు కీలక పాత్ర పోషించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్‌పై సానియా మీర్జా కీలక వ్యాఖ్యలు.. ఐపీఎల్ స్ఫూర్తిగా అవి ఏర్పడ్డాయి?