Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో బిజీబిజీగా రజనీకాంత్.. నేడు అఖిలేష్‌తో భేటీ...

Webdunia
ఆదివారం, 20 ఆగస్టు 2023 (15:30 IST)
ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన శనివారం సాయంత్రం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. ఆదివారం మాజీ సీఎం, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్‌తో సమావేశమయ్యారు. యోగి ఆదిత్యనాథ్‌కు పాదాభివందనం చేసిన రజనీకాంత్.. అఖిలేశ్ యాదవ్‌ను ఆలింగనం చేసుకున్నారు. రజనీకాంత్ వెంట ఆయన భార్య లత కూడా ఉన్నారు. అఖిలేశ్ తండ్రి, సమాజ్ వాదీ పార్టీ దివంగత అధినేత ములాయం సింగ్ యాదవ్ చిత్ర పటం వద్ద రజనీకాంత్ నివాళులు అర్పించారు.
 
'ముంబైలో జరిగిన ఓ ఫంక్షన్‌లో తొమ్మిదేళ్ల క్రితం అఖిలేశ్ యాదవ్‌‌ను కలుసుకున్నాను. అప్పటి నుంచి మేము స్నేహితులం. ఫోన్‌‌లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఐదేళ్ల క్రితం నేను ఇక్కడకు షూటింగ్ కోసం వచ్చినప్పటికీ, కలుసుకోలేకపోయాను. అందుకని ఇప్పుడు కలిశాను' అని రజనీ మీడియా ప్రతినిధులతో అన్నారు. 
 
అఖిలేశ్‌తో సమావేశం ఎలా జరిగిందని ప్రశ్నించగా.. గొప్పగా జరిగిందని బదులిచ్చారు. ఇది మార్యాదపూర్వక భేటీయేనని, అఖిలేశ్ తన మిత్రుడని రజనీ పేర్కొన్నారు. తాను ఆదివారం లక్నో నుంచి అయోధ్య రాముడి దర్శనం కోసం వెళుతున్నట్టు తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిని కూడా కలుస్తున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. నవ్వుతూ నో అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments