Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఫ్జల్ గురు తనయుడు గాలిబ్ గురు భారత పౌరుడు కాదా?

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (15:15 IST)
అఫ్జలు గురు తనయుడు గాలిబ్ గురు భారత పౌరుడు కాదా? అనే చర్చ ఇపుడు కొత్తగా తెరపైకి వచ్చింది. గాలిబ్ గురుకు ఇప్పటికే ఆధార్ కార్డు కూడా వచ్చింది. కానీ, పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోగా, దీన్ని కేంద్రం ఇంకా మంజూరు చేయలేదు. ఈ నేపథ్యంలో గాలిబ్ గురు పౌరసత్వంపై చర్చ మొదలైంది.
 
ఇదిలావుంటే తనకు ఆధార్ గుర్తింపు కార్డు రావడంపై గాలిబ్ గురు స్పందిస్తూ, తనకు ఈ గుర్తింపు కార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అయితే పాస్‌పోర్ట్‌కు కూడా ఇప్పిస్తే విదేశాలకు వెళ్లి చదువుకుంటానని చెప్పాడు. ఇప్పటికే తనకు ఇటలీ నుంచి స్కాలర్‌షిప్ ఆఫర్ కూడా వచ్చిందని అన్నాడు. తనకు పాస్‌పోర్ట్ కూడా దక్కితే ఓ భారతీయ పౌరుడిగా తాను చాలా గర్విస్తానని గాలిబ్ చెప్పాడు. 
 
అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించిన ఓ పత్రికపైనా గాలిబ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు పాస్‌పోర్ట్ ఇస్తేనే భారతీయుడిగా గర్విస్తానని సదరు పత్రిక రాసిందని, తన ఉద్దేశం మాత్రం అది కాదని అతను అన్నాడు. కాగా, 2001 జరిగిన పార్లమెంట్‌పై దాడి కేసులో అఫ్జల్ గురును 2013లో భారత ప్రభుత్వం ఉరితీసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments