అఫ్జల్ గురు తనయుడు గాలిబ్ గురు భారత పౌరుడు కాదా?

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (15:15 IST)
అఫ్జలు గురు తనయుడు గాలిబ్ గురు భారత పౌరుడు కాదా? అనే చర్చ ఇపుడు కొత్తగా తెరపైకి వచ్చింది. గాలిబ్ గురుకు ఇప్పటికే ఆధార్ కార్డు కూడా వచ్చింది. కానీ, పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోగా, దీన్ని కేంద్రం ఇంకా మంజూరు చేయలేదు. ఈ నేపథ్యంలో గాలిబ్ గురు పౌరసత్వంపై చర్చ మొదలైంది.
 
ఇదిలావుంటే తనకు ఆధార్ గుర్తింపు కార్డు రావడంపై గాలిబ్ గురు స్పందిస్తూ, తనకు ఈ గుర్తింపు కార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అయితే పాస్‌పోర్ట్‌కు కూడా ఇప్పిస్తే విదేశాలకు వెళ్లి చదువుకుంటానని చెప్పాడు. ఇప్పటికే తనకు ఇటలీ నుంచి స్కాలర్‌షిప్ ఆఫర్ కూడా వచ్చిందని అన్నాడు. తనకు పాస్‌పోర్ట్ కూడా దక్కితే ఓ భారతీయ పౌరుడిగా తాను చాలా గర్విస్తానని గాలిబ్ చెప్పాడు. 
 
అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించిన ఓ పత్రికపైనా గాలిబ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు పాస్‌పోర్ట్ ఇస్తేనే భారతీయుడిగా గర్విస్తానని సదరు పత్రిక రాసిందని, తన ఉద్దేశం మాత్రం అది కాదని అతను అన్నాడు. కాగా, 2001 జరిగిన పార్లమెంట్‌పై దాడి కేసులో అఫ్జల్ గురును 2013లో భారత ప్రభుత్వం ఉరితీసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments