రాజీవ్ గాంధీపై దాడి కూడా ప్రమాదమేనా? : కేంద్ర మంత్రి వీకే సింగ్

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (14:54 IST)
పుల్వామా ఉగ్రదాడి 'ఓ ప్రమాదం' అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వీకే సింగ్ మండిపడ్డారు.  ఆత్మాహుతి దాడిలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ మరణించడం కూడా ప్రమాదమేనా లేదా ఉగ్రవాద ఘటనా? వీకే సింగ్‌ ప్రశ్నించారు.  
 
బాలాకోట్‌లో ఉగ్రస్థావరాలపై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ జరిపిన దాడుల్లో ఎంతమంది చనిపోయి ఉంటారని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. బాలాకోట్‌ దాడిలో 250 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఒకే ప్రదేశంలో దాడి జరిగింది. మరెక్కడ కూడా జరగలేదు. పాకిస్థాన్‌లోని సాధారణ పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా నివాస ప్రాంతాలకు దూరంగా ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకొని మెరుపు దాడులు చేసినట్లు వీకే సింగ్‌ వివరించారు. 
 
మెరుపు దాడుల్లో 250 మందికి పైగా మరణించారని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా వ్యాఖ్యలపై కూడా వీకేసింగ్‌ స్పందించారు. దాడులు జరిగిన సమయంలో అక్కడ ఎంతమంది ఉన్నారన్న దానిపై మృతుల సంఖ్య ఆధారపడి ఉంటుంది. అదొక అంచనా మాత్రమే. ఖచ్చితంగా 250 మంది చనిపోయారని అమిత్‌ షా నిర్దారించలేదని.. అయితే, ఎక్కువ సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారని మాత్రమే చెబుతున్నారని వీకే సింగ్‌ వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments