Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీవ్ గాంధీపై దాడి కూడా ప్రమాదమేనా? : కేంద్ర మంత్రి వీకే సింగ్

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (14:54 IST)
పుల్వామా ఉగ్రదాడి 'ఓ ప్రమాదం' అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వీకే సింగ్ మండిపడ్డారు.  ఆత్మాహుతి దాడిలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ మరణించడం కూడా ప్రమాదమేనా లేదా ఉగ్రవాద ఘటనా? వీకే సింగ్‌ ప్రశ్నించారు.  
 
బాలాకోట్‌లో ఉగ్రస్థావరాలపై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ జరిపిన దాడుల్లో ఎంతమంది చనిపోయి ఉంటారని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. బాలాకోట్‌ దాడిలో 250 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఒకే ప్రదేశంలో దాడి జరిగింది. మరెక్కడ కూడా జరగలేదు. పాకిస్థాన్‌లోని సాధారణ పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా నివాస ప్రాంతాలకు దూరంగా ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకొని మెరుపు దాడులు చేసినట్లు వీకే సింగ్‌ వివరించారు. 
 
మెరుపు దాడుల్లో 250 మందికి పైగా మరణించారని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా వ్యాఖ్యలపై కూడా వీకేసింగ్‌ స్పందించారు. దాడులు జరిగిన సమయంలో అక్కడ ఎంతమంది ఉన్నారన్న దానిపై మృతుల సంఖ్య ఆధారపడి ఉంటుంది. అదొక అంచనా మాత్రమే. ఖచ్చితంగా 250 మంది చనిపోయారని అమిత్‌ షా నిర్దారించలేదని.. అయితే, ఎక్కువ సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారని మాత్రమే చెబుతున్నారని వీకే సింగ్‌ వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments