Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధ దంపతులను డబ్బు కోసం చంపేశారు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (14:34 IST)
తల్లీ కొడుకులు కలిసి డబ్బు కోసం వృద్ధ దంపతులను కిరాతకంగా హతమార్చిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే దక్షిణ ఢిల్లీలోని అమర్ కాలనీలో వీరేందర్ కూమార్ ఖనేజా (77), సరళ (72) అనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. 
 
వారి ఇంట్లో పనిచేస్తున్న మహిళ, ఆమె కుమారుడు ఇద్దరూ కలిసి వారిని దారుణంగా చంపి 9 లక్షల నగదును, బంగారు ఆభరణాలను చోరీ చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈనెల 26వ తేదీన ఆ వృద్ధ దంపతులు కనిపించడం లేదని ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వారి ఫ్లాట్‌ను బలవంతంగా తెరిచి చూసారు, అక్కడ ఇద్దరూ శవాలుగా కనిపించారు.
 
దుండగులు ఫ్లాట్ లోపలి వైపు తాళం వేసి దంపతుల ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేసారు. బాధితుల కుమారుడు డాక్టర్‌ అమిత్‌ ఖనేజా అమెరికాలో నివసిస్తున్నాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు వారి ఇంట్లో పనిచేసే మహిళను తమదైన రీతిలో విచారణ చేయగా అసలు విషయం బయటపెట్టింది. డబ్బు కోసమే ఈ పనికి పాల్పడినట్లు ఒప్పుకుంది.
 
జనవరి 18న వీరేందర్‌ ఖనేజా లాకర్‌లో డబ్బును ఉంచడం గమనించిన నిందితురాలు అదే రోజు మధ్యాహ్నం వీరేందర్ బయటకు వెళ్లగానే తమ కుమారుడితో కలిసి ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు సమాచారం అందించారు. వారి నుండి 9 లక్షల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments