Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధ దంపతులను డబ్బు కోసం చంపేశారు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (14:34 IST)
తల్లీ కొడుకులు కలిసి డబ్బు కోసం వృద్ధ దంపతులను కిరాతకంగా హతమార్చిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే దక్షిణ ఢిల్లీలోని అమర్ కాలనీలో వీరేందర్ కూమార్ ఖనేజా (77), సరళ (72) అనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. 
 
వారి ఇంట్లో పనిచేస్తున్న మహిళ, ఆమె కుమారుడు ఇద్దరూ కలిసి వారిని దారుణంగా చంపి 9 లక్షల నగదును, బంగారు ఆభరణాలను చోరీ చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈనెల 26వ తేదీన ఆ వృద్ధ దంపతులు కనిపించడం లేదని ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వారి ఫ్లాట్‌ను బలవంతంగా తెరిచి చూసారు, అక్కడ ఇద్దరూ శవాలుగా కనిపించారు.
 
దుండగులు ఫ్లాట్ లోపలి వైపు తాళం వేసి దంపతుల ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేసారు. బాధితుల కుమారుడు డాక్టర్‌ అమిత్‌ ఖనేజా అమెరికాలో నివసిస్తున్నాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు వారి ఇంట్లో పనిచేసే మహిళను తమదైన రీతిలో విచారణ చేయగా అసలు విషయం బయటపెట్టింది. డబ్బు కోసమే ఈ పనికి పాల్పడినట్లు ఒప్పుకుంది.
 
జనవరి 18న వీరేందర్‌ ఖనేజా లాకర్‌లో డబ్బును ఉంచడం గమనించిన నిందితురాలు అదే రోజు మధ్యాహ్నం వీరేందర్ బయటకు వెళ్లగానే తమ కుమారుడితో కలిసి ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు సమాచారం అందించారు. వారి నుండి 9 లక్షల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments