Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణం... అతడి మొండెం జనగామలో... తల నాగ్ పూర్‌లో...

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (16:52 IST)
రైలు మెట్ల మీద కూర్చుని ప్రయాణిస్తున్న వ్యక్తి జారిపడటంలో శరీరం రెండు ముక్కలయింది. మొండెం అక్కడే పడిపోగా తల మాత్రం మెట్లలో ఇరుక్కుని నాగ్‌పుర్ వరకూ వెళ్లింది. సికింద్రాబాద్‌ నుంచి నాగ్‌పుర్‌ వెళ్లే నాగపూర్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి  ప్రమాదవశాత్తు జనగామ-రఘునాథపల్లి రైల్యే స్టేషన్‌ల మధ్య ఆ వ్యక్తి జారిపడ్డాడు. 
 
ఆదివారం ఉదయం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా మొండెం మాత్రం నుజ్జునుజ్జు అయ్యి కనిపించింది తల ఎంత వెతికినా కనిపించలేదు. శరీర భాగాలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా గుర్తు తెలియని వ్యక్తి తల బోగీ మెట్లలో ఇరుక్కుని ఉండటాన్ని నాగ్‌పూర్ రైల్వే స్టేషన్ సిబ్బంది గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. 
 
రైలు ప్రయాణించిన మార్గాలలోని అన్ని రైల్వే పోలీస్‌స్టేషన్‌లను అప్రమత్తం చేసారు. అది రఘునాథపల్లి వద్ద జరిగిన సంఘటనలో మరణించిన వ్యక్తి తలేనని కాజీపేట పోలీసులు భావించి సమాచారం అందించారు. తలకు బనియన్ ముక్కలు అతుక్కుని ఉన్నాయి. ఆ ముక్కలు మొండానికి ఉన్న ఎరుపు బనియన్‌తో సరిపోలడంతో నాగ్‌పుర్‌లో దొరికిన తల ఆ వ్యక్తిదేనని నిర్ధారణకు వచ్చారు. 
 
తలను తెచ్చి అప్పగించే బాధ్యతను సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో పనిచేస్తున్న కాజీపేటకు చెందిన రైల్వే కానిస్టేబుల్‌కు ఇచ్చారు. సోమవారం తలను ఎంజీఎం ఆసుపత్రిలోని మొండెం వద్ద వుంచి పోస్ట్‌మార్టం నిర్వహించారు. వ్యక్తి 25 నుండి 30 ఏళ్ల మధ్య వయస్కుడని నిర్ధారించారు. కానీ మృతుని వివరాలు మాత్రం తెలియరాలేదు. ఇది హత్యా లేక ప్రమాదమా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments