Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కౌషల్‌కు డబ్బు పిచ్చి...మీడియా ముందుకు కౌషల్ ఆర్మీ

Advertiesment
Kaushal Army
, మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (11:59 IST)
బిగ్‌బాస్ హౌస్‌లో కౌశల్‌కు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. ఏకంగా ఆర్మీనే మొదలుపెట్టారు. ఆయన గెలిచాక సంబరాలు చేసుకుని, సేవా కార్యక్రమాలకు కూడా ఎంతో ఖర్చు పెట్టారు. ఇప్పుడు కౌషల్ నిజ స్వరూపం తెలుసుకుని మీడియా ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు కౌశల్ ఆర్మీ ఫౌండర్ ఇమ్మాన్‌తో సహా మరికొంతమంది అభిమానులు. కౌషల్ చాలా మనీ మైండెడ్ అని, ఎక్కడికి వచ్చినా ఫ్యాన్స్‌తోనే ఖర్చు పెట్టిస్తారని, ఫ్లైట్ టికెట్స్, హోటల్ అన్నీ ఫ్యాన్స్ దగ్గరే బుక్ చేయిస్తాడని ఓ తెలుగు ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయాడు ఇమ్మాన్.
 
ఎంతో మంది ఫ్యాన్స్ అతని కోసం డబ్బు ఖర్చు పెట్టారని, కొంతమందైతే బంగారం అమ్మేసి మరీ డబ్బు తెచ్చారని, వారందరూ కౌషల్ ప్రవర్తన చూసి ఎంతో బాధపడుతున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో ఎలాగైతే తాను ఒంటరి అంటూ సింపతీ గేమ్ ఆడాడో బయట కూడా అలాగే గేమ్స్ ఆడి తనకు వ్యతిరేకంగా ఉండేవారిని టార్గెట్ చేస్తున్నాడు. 
 
అభిమానులను రెచ్చగొట్టి వారికి వ్యతిరేకంగా ట్రోల్స్ చేసేలా చేస్తాడు. 'సోషల్ మీడియాలో నాపై కొందరు కామెంట్స్ చేస్తున్నా ఆర్మీ స్పందించడం లేదు, మీరు యాక్టివ్‌గా ఉండాలి, అప్పుడే నేను ముందుకెళ్లగలను, లెట్స్ ఫైర్' అంటూ సందేశాలు పంపుతాడు. అందుకు సంబంధించిన మెసేజ్‌లు కూడా తన వద్ద ఉన్నాయని ఇమ్మాన్ ఆరోపించారు.
 
నేను కౌషల్ ఆర్మీ ఫౌండేషన్‌కు 10 వేలు విరాళంగా ఇచ్చాను. తర్వాత నేను ప్రశ్నిస్తే, వాటికి సమాధానం చెప్పకుండా నాపై మూకుమ్మడి దాడికి దిగారు. బెంగుళూరు నుండి ఒకావిడ ఫోన్ చేసి, నీ డబ్బు తిరిగిచ్చేస్తాము..మూసుకుని కూర్చుంటావా? అని అబ్యూస్ చేసినట్లు అనామిక అనే లేడీ ఫ్యాన్ మీడియా ముందుకొచ్చి చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పురుషాధిక్యమా... నీకో సవాల్ : ఓవియా