Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరదాగా ఈత కొట్టేందుకు తుంగభద్రలో దూకిన మహిళా వైద్యురాలు, మృతి (video)

ఐవీఆర్
గురువారం, 20 ఫిబ్రవరి 2025 (16:38 IST)
వేసవి ఎండలు క్రమంగా ముదురుతున్నాయి. సాయంకాలం అట్లా సేదతీరేందుకు చాలామంది నదులు, సరస్సులు, సముద్రపు తీరాల వైపు వెళ్తుంటారు. అక్కడ చల్లని గాలుల మధ్య కాస్త కాలం గడుపుతుంటారు. ఐతే అలాంటి సమయాలలో కొంతమంది నీటిలో ఈతకొట్టేందుకు ఉత్సుకత చూపిస్తుంటారు. ఆ ఉత్సుకతే ఓ మహిళా వైద్యురాలి ప్రాణం తీసింది.
 
పూర్తి వివరాలను చూస్తే... హైదరాబాద్ నగరంలోని నాంపల్లికి చెందిన మహిళా వైద్యురాలు అనన్య రామోహన్, ఆమె స్నేహితురాళ్లు కొంతమంది కర్నాటక లోని గంగావతి జిల్లాలోని సనాపూర్ గెస్ట్ హౌసులో దిగారు.
 
అనంతరం వారు తుంగభద్ర నది వద్ద నీటిలో ఈత కొట్టాలని నిర్ణయించుకున్నారు. అలా అనన్య అవతలవైపు 25 అడుగులు ఎత్తున్న గుట్టపైనుంచి నదిలో ఈత కొట్టేందుకు దూకేసారు. ఆమె అలా దూకి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో నదిలో అలలు రావడంతో ఆమె రాలేక ఇబ్బందిపడ్డారు. దీనితో ఆమెను రక్షించేందుకు ఆమె ఫ్రెండ్స్ ప్రయత్నించినప్పటికీ ఆమె నదిలో కొట్టుకుపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఐతే అప్పటికే అనన్య గల్లంతయ్యారు. సరదా కోసం వచ్చి స్నేహితురాలును పోగొట్టుకున్నామంటూ ఆమె స్నేహితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments