Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bride: రిసెప్షన్ జరుగుతుండగా వేదికపై నుంచి వధువును కిడ్నాప్ చేశారు.. ఎక్కడ?

సెల్వి
గురువారం, 20 ఫిబ్రవరి 2025 (16:23 IST)
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో వివాహ రిసెప్షన్ సందర్భంగా నవ వధువును అపహరణకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బుధవారం రాత్రి వధువు సప్నా సోలంకి, ఆమె భర్త ఆశిష్ రాజక్ రిసెప్షన్ వేదికకు వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. వెంటనే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వేగంగా స్విఫ్ట్ కారులో వచ్చి, రిసెప్షన్ వేదికపై గల వధువును ఎత్తుకెళ్లారు. వరుడితో పాటు అక్కడున్న వారిని బెదిరించి ఆమెను కిడ్నాప్ చేశారు. 
 
ఈ సంఘటన వరుడి కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆ తర్వాత పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని టిటి నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సుధీర్ అరాజారియా తెలిపారు.
 
"మేము సప్న మొబైల్ లొకేషన్‌ను ట్రాక్ చేస్తున్నాము, అది సమీపంలోని నగరమైన సాగర్‌లో ఉన్నట్లు కనుగొనబడింది. మరింత దర్యాప్తు చేయడానికి సాగర్‌కు ఒక పోలీసు బృందాన్ని మోహరించాము" అని చెప్పుకొచ్చారు.
 
సప్నా మాజీ ప్రేమికుడే ఈ కిడ్నాప్ వెనుక ఉన్నాడని పోలీసులు తెలిపారు. సప్నా కిడ్నాప్ గత ప్రేమ వ్యవహారం కారణంగా జరిగి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. వివాహం తర్వాత జరిగిన వీడ్కోలు వేడుకలో సప్నా స్వస్థలమైన గంజ్‌బసోడాలో తన కారు టైర్లను ఎవరో పంక్చర్ చేశారని వరుడు ఆరోపించాడు. 
 
సప్నా ఈ విషయం తనకు చెప్పిందని ఆశిష్ ఆరోపించాడు. సప్నా కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో వారిని సంప్రదించలేకపోవడంతో, వారు కూడా రిసెప్షన్‌కు హాజరు కాకపోవడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. కిడ్నాపర్ల గురించి మరిన్ని వివరాలు సేకరించడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments