Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్కల కాళ్లు - మూతులను తాళ్ళతో కట్టేసి చంపేశారు...

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (12:28 IST)
మహారాష్ట్రలో దారుణం జరిగింది. 90 మూగజీవులైన శునకాలను అత్యంత కిరాతకంగా చంపేశారు. కాళ్ల, మూతులను తాళ్లతో కట్టేసి ఒకేచోట చంపేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, గిర్దా - సవల్దాబారా రోడ్డుకు పక్కన ఉన్న పదుల సంఖ్యలో కుక్కల కళేబరాలు పడివుండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గిర్డా రహదారిని పరిశీలించగా.. ఐదు ప్రాంతాల్లో సుమారు 90 శునకాల కళేబరాలను గుర్తించారు. 
 
ఆ తర్వాత అటవీ శాఖ అధికారులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు కుక్కల కళేబరాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ.. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే కుక్కల మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కుక్కలను పట్టేవారిని కూడా విచారిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments