Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులు.. రాష్ట్రపతి ఆమోదం

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (06:45 IST)
సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులు నియమితులయ్యారు. అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని సుప్రీం కొలీజియం చేసిన సిఫార్సులకు.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. త్వరలోనే నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయని చెప్పారు.
 
కొత్త న్యాయమూర్తుల్లో.. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓకా.., గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి ఉన్నారు. అలాగే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న కొలీజియం జాబితాలో ఉన్నారు.

వీరితోపాటు కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీటీ రవికుమార్‌, మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి ఎంఎం సుందరేశ్‌, గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బేలా ఎం. త్రివేది, సీనియర్‌ అడ్వకేట్‌ పీఎస్​ నరసింహా ఉన్నారు. 

వీరంతా ఈ నెల  31న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదిలా వుండగా తెలుగు వాడైన సీనియర్‌ అడ్వకేట్‌ పీఎస్​ నరసింహా సీజే అయ్యే అవకాశముంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

Ustad: పవన్ కళ్యాణ్ చే ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments