Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు - బుధవారం విచారణ

సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు - బుధవారం విచారణ
, సోమవారం, 23 ఆగస్టు 2021 (16:05 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు ఇపుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసు వ్యవహారంలో నాటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వేసిన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 
 
ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని సుప్రీంకోర్టులో సండ్ర పిటిషన్ వేశారు. అలాగే, ఈ కేసు విచారణలో అవినీతి నిరోధక చట్టం వర్తించదంటూ రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు బుధవారం విచారణ జరుపుతామని జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిల ధర్మాసనం తెలిపింది. 
 
మరోవైపు, ఇదే విషయమై సండ్ర వేసిన పిటిషన్‌ను గత ఏడాది తెలంగాణ హైకోర్టు కొట్టేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఆయన సవాల్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ‌వాను మృత‌దేహాన్ని అప్ప‌గించి తిరిగి వ‌స్తూ....