Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో ఏడుగురు యువతులను మింగేసిన వాగు

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (08:52 IST)
తమిళనాడు రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ వాగు ఏడుగురు యువతులను మింగేసింది. కెడిలం వాగులో ఈ ఏడుగురు అమ్మాయిలు మునిగిపోయారు. ఎండవేడిమిని తట్టుకోలేక వాగుల స్నానం చేసేందుకు ఈ ఏడుగురు యువతులు వెళ్లారు. వీరంతా వాగులో స్నానం చేస్తుండగానే ఒక్కొక్కరుగా నీటిలో కొట్టుకునిపోయారు. నలుగురు యువతులను కాపాడే ప్రయత్నంలో మరో ముగ్గురు యువతులు విగతజీవులయ్యారు. దీంతో మొత్తం 7 మంది ప్రాణాలు కోల్పోగా, ఆ గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది. 
 
ఈ విషాదకర ఘటన రాష్ట్రంలోని కడలూరు జిల్లా కుచ్చిపాళెయంలోని కెడిలం వాగులో జరిగింది. ఈ వాగులోకి ఉక్కపోతను తట్టుకోలేక స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే ఉన్నట్టుండి వాగులో నీటి ప్రవాహం పెరగడంతో ఆ యువతులు నీటిలో మునిగిపోయారు. 
 
మృతులను సంఘవి (16), సుముత (18), నవిత (18), ప్రియదర్శిని (15), మోని,్ (18), దివ్యదర్శిని (10), ప్రియ (18)లుగా గుర్తించారు. వీరంతా కుచ్చిపాళెయం, అయంకురింజిపడి గ్రామాలకు చెందినవారిగా గుర్తించారు. వీరిలో ప్రియదర్శిని, దివ్యదర్శినిలు అక్కా చెల్లెళ్ళు. దీంతో వారి తల్లిదండ్రుల ఆర్తనాదాలకు ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారు. 

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments