Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష రూపాయల అప్పు కోసం.. నాలుగేళ్ల చిన్నారిని హత్య చేశారు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (12:11 IST)
కన్యాకుమారిలో దారుణం చోటుచేసుకుంది. లక్ష రూపాయల అప్పు కోసం ఓ నాలుగేళ్ల చిన్నారి బలైపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా, ఆరోగ్యపురంకు చెందిన కెబిన్ రాజ్, సరణ్య దంపతులకు నాలుగేళ్ల రైనా అనే కుమారుడు వున్నాడు. శరణ్య అదే ప్రాంతానికి చెందిన ఆంటోనీ సామి అనే వ్యక్తి వద్ద లక్ష రూపాయలను అప్పుగా తీసుకుంది. 
 
ఈ డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆంటోనీ సామి శరణ్యతో వాగ్వివాదానికి దిగాడు. శరణ్య కూడా డబ్బు తిరిగి ఇవ్వడంలో జాప్యం చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇంటికి బయట ఆడుకుంటున్న శరణ్య కుమారుడిని ఆంటోనీ సామి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. 
 
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నాలుగేళ్ల బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు రైనా మృతదేహమే కనిపించింది. దీంతో ఆంటోనీ సామిని పోలీసులు అరెస్ట్ చేశారు విచారణ జరుపుతున్నారు. కిడ్నాప్ చేసిన ఆంటోనీనే ఆ బాలుడిని హతమార్చినట్లు పోలీసులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments