పుదుచ్చేరిలో ఘోరం- 17ఏళ్ల బాలికపై ఏడుగురు వ్యక్తుల అత్యాచారం..

పుదుచ్చేరిలో ఘోరం జరిగింది. చెన్నై ఘటన తరహాలో ఓ బాలికపై ఏడుగురు వ్యక్తులు ఇంట్లో నిర్భంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. పుదుచ్చేరి రెడ్డియార్‌పాళయం ప్రాంతానికి చెందిన బాలి

Webdunia
శుక్రవారం, 20 జులై 2018 (11:11 IST)
పుదుచ్చేరిలో ఘోరం జరిగింది. చెన్నై ఘటన తరహాలో ఓ బాలికపై ఏడుగురు వ్యక్తులు ఇంట్లో నిర్భంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. పుదుచ్చేరి రెడ్డియార్‌పాళయం ప్రాంతానికి చెందిన బాలిక (17) స్థానికంగా ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తోంది.


ప్రతి రోజు బస్సులో రాకపోకలు సాగించేది. వలుదావూర్‌ ప్రాంతానికి ఓ యువకుడు పరిచయం చేసుకుని, ప్రేమిస్తున్నట్లు ఆమెను నమ్మించాడు. కొన్ని రోజుల క్రితం ఆ బాలికను ఓ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో సెల్‌ఫోనులో చిత్రీకరించాడు. 
 
ఆ వీడియోతో ఆమెను బెదిరిస్తూ లొంగదీసుకునేవాడు. అనంతరం ఓ ఇంట్లో బంధించి తన ఆరుగురు స్నేహితులను పిలిచాడు. వాళ్లు కూడా బాలికపై అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా చిత్రహింసలకు గురిచేశారు. అక్కడి నుంచి బయటపడ్డ బాలిక బంధువుల సాయంతో బాలల సంక్షేమ కమిటీకి ఫిర్యాదు చేశారు.

కమిటీ ఛైర్మన్‌ రాజేంద్రన్‌, సభ్యులు ఆ బాలికను విచారించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుక్కనూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments