Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పెళ్లి.. కాపురానికి పంపని తండ్రి.. విషంతాగి మహిళ ఆత్మహత్య

తమిళనాడులో మహిళలకు రక్షణ కరువైంది. మొన్నటికి మొన్న దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా ప్రేమించి వివాహం చేసుకున్న నెల రోజులకే ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తమిళనాడు

Webdunia
శుక్రవారం, 20 జులై 2018 (10:38 IST)
తమిళనాడులో మహిళలకు రక్షణ కరువైంది. మొన్నటికి మొన్న దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా ప్రేమించి వివాహం చేసుకున్న నెల రోజులకే ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా స్వామిమలై సమీపం అన్నానగర్‌‌లో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే అన్నానగర్‌కు చెందిన నీలమేఘం కుమార్తె అనసూయ (24) బీటెక్‌ చదివి ఇంటివద్దే ఉంటోంది. వీరి ఎదురింటికి చెందిన సెల్వరాజ్‌ కుమారుడు పుగళేంది కేబుల్‌ టీవీలో పని చేస్తున్నాడు. పుగళేంది, అనసూయ మధ్య ప్రేమ చిగురించింది. నెలక్రితమే వీరు రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఇటీవల వీరి వివాహం గురించి ఇరువురి ఇళ్లలో తెలిసింది. దీంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. పంచాయితీ పెద్దలు కూడా వీరి వివాహం సరైనదేనని తీర్పు చెప్పారు. 
 
అయితే ఈ పెళ్లి అనసూయ తండ్రి నీలమేఘంకు నచ్చలేదు. దీంతో కుమర్తెను కాపురానికి పంపించలేదు. పైగా పుగళేంది కుటుంబసభ్యులు కూడా ఈ విషయంపై పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన అనసూయ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments