Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పెళ్లి.. కాపురానికి పంపని తండ్రి.. విషంతాగి మహిళ ఆత్మహత్య

తమిళనాడులో మహిళలకు రక్షణ కరువైంది. మొన్నటికి మొన్న దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా ప్రేమించి వివాహం చేసుకున్న నెల రోజులకే ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తమిళనాడు

Webdunia
శుక్రవారం, 20 జులై 2018 (10:38 IST)
తమిళనాడులో మహిళలకు రక్షణ కరువైంది. మొన్నటికి మొన్న దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా ప్రేమించి వివాహం చేసుకున్న నెల రోజులకే ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా స్వామిమలై సమీపం అన్నానగర్‌‌లో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే అన్నానగర్‌కు చెందిన నీలమేఘం కుమార్తె అనసూయ (24) బీటెక్‌ చదివి ఇంటివద్దే ఉంటోంది. వీరి ఎదురింటికి చెందిన సెల్వరాజ్‌ కుమారుడు పుగళేంది కేబుల్‌ టీవీలో పని చేస్తున్నాడు. పుగళేంది, అనసూయ మధ్య ప్రేమ చిగురించింది. నెలక్రితమే వీరు రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఇటీవల వీరి వివాహం గురించి ఇరువురి ఇళ్లలో తెలిసింది. దీంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. పంచాయితీ పెద్దలు కూడా వీరి వివాహం సరైనదేనని తీర్పు చెప్పారు. 
 
అయితే ఈ పెళ్లి అనసూయ తండ్రి నీలమేఘంకు నచ్చలేదు. దీంతో కుమర్తెను కాపురానికి పంపించలేదు. పైగా పుగళేంది కుటుంబసభ్యులు కూడా ఈ విషయంపై పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన అనసూయ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments