Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లయిన వాడే ప్రియుడు... మరొకతనితో రొమాన్స్... కాదన్నందుకు కోసేసింది....

పెళ్ళయిన వ్యక్తిని ప్రేమించింది. రెండేళ్ళ పాటు సహజీవనం చేసింది. మరో ఇద్దరితో పరిచయం ఏర్పరచుకుంది. తన అక్రమ సంబంధానికి మొదటి ప్రియుడు అడ్డొస్తున్నాడన్న కోపంతో దారుణంగా మర్మాంగాలను కోసి హత్య చేసింది. చి

పెళ్లయిన వాడే ప్రియుడు... మరొకతనితో రొమాన్స్... కాదన్నందుకు కోసేసింది....
, బుధవారం, 18 జులై 2018 (17:31 IST)
పెళ్ళయిన వ్యక్తిని ప్రేమించింది. రెండేళ్ళ పాటు సహజీవనం చేసింది. మరో ఇద్దరితో పరిచయం ఏర్పరచుకుంది. తన అక్రమ సంబంధానికి మొదటి ప్రియుడు అడ్డొస్తున్నాడన్న కోపంతో దారుణంగా మర్మాంగాలను కోసి హత్య చేసింది. చిత్తూరు శ్రీకాళహస్తిలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
శ్రీకాళహస్తి సమీపంలోని బుచ్చనాయుడు కండ్రిగలో నివాసముంటున్న గుర్రప్ప, లక్ష్మిలకు నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం ప్రవళ్లిక అనే యువతితో గుర్రప్పకు పరిచయమైంది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. రెండేళ్ళ పాటు శ్రీకాళహస్తి పట్టణంలోనే ఇద్దరూ కాపురం పెట్టి సహజీవనం కూడా చేశారు. 
 
ప్రవళ్లిక అనాధ. గుర్రప్పతో రెండు సంవత్సరాల పాటు అక్రమ సంబంధాన్ని కొనసాగించిన ప్రవళిక మరో ఇద్దరు యువకులతో పరిచయం ఏర్పరచుకుంది. గుర్రప్పకు విషయం తెలియడంతో మందలించాడు. దీంతో ప్రవళ్లిక నిన్న రాత్రి గుర్రప్ప తన ఇంటిలో నిద్రిస్తుండగా మర్మాంగాలను కోసేసి గొంతు నులిపి చంపేసింది. ప్రస్తుతం ప్రవళ్లిక పరారీలో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలి కోసం వెతుకుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇదీ అవిశ్వాసాల చరిత్ర... నెహ్రూ నుంచి మోడీ వరకు...