Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంచు కొండను అగ్ని పర్వతంలా మార్చిన రేప్... నిందితులు కొట్టుకు చస్తున్నారు...

ఎప్పుడూ చల్లగా ఆహ్లాదాన్నిచ్చే ప్రాంతం సిమ్లా. సిమ్లాలో అడుగుపెట్టినవారికి పెట్టనివారికీ ఆ పేరు చెబితే చాలు చల్లగా అనిపిస్తుంది. ఇపుడలాంటి సిమ్లా అగ్నిపర్వతంలా మారింది. దీనికి కారణం ఓ రేప్ ఘటన. వివరాల్లోకి వెళితే... ఇటీవల సంపన్న వర్గానికి చెందిన ఆరుగ

మంచు కొండను అగ్ని పర్వతంలా మార్చిన రేప్... నిందితులు కొట్టుకు చస్తున్నారు...
, శుక్రవారం, 21 జులై 2017 (14:24 IST)
ఎప్పుడూ చల్లగా ఆహ్లాదాన్నిచ్చే ప్రాంతం సిమ్లా. సిమ్లాలో అడుగుపెట్టినవారికి పెట్టనివారికీ ఆ పేరు చెబితే చాలు చల్లగా అనిపిస్తుంది. ఇపుడలాంటి సిమ్లా అగ్నిపర్వతంలా మారింది. దీనికి కారణం ఓ రేప్ ఘటన. వివరాల్లోకి వెళితే... ఇటీవల సంపన్న వర్గానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఓ బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. సామూహిక అత్యాచారానికి పాల్పడమే కాకుండా ఆ బాలికను అత్యంత దారుణంగా హతమార్చారు. 
 
సిమ్లాలోని కొత్కాయ్ పట్టణానికి చెందిన ఆ బాలిక ఉదంతాన్ని, ఆమెపై జరిగిన దారుణం, హత్యను చూసిన స్థానికులకు గుండె చెరువైంది. పైగా గ్యాంగ్ రేప్ చేసినవారిని కాపాడేందుకు పోలీసులు సహకరిస్తున్నారన్న అనుమానం వారిలో కలిగింది. అంతే... ఈ విషయంపై పోలీసులను నిలదీయడం మొదలుపెట్టారు. 
 
ఈ క్రమంలో పోలీసులు నిందితులను అరెస్టు చేసి జైలులో పెట్టినప్పటికీ వారికి రాచమర్యాదలు జరుగుతున్నట్లు గమనించి స్థానికులు ఆందోళనకు దిగారు. ఇదిలావుండగానే పోలీసుల కస్టడీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజేందర్ సింగ్ మరో నిందితుడు సూరత్‌తో గొడవపడి అతడిని హత్య చేశాడు. ఈ సంగతి బయటకు రావడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. 
 
2 వేల మందికి పైగా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి పోలీసు స్టేషనుకు నిప్పు పెట్టారు. ఈ సంఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. పరిస్థితి అదుపుతప్పడంతో పాఠశాలలు, దుకాణాలు, కార్యాలయాలను మూసివేశారు. దీనిపై సీరియస్ అయిన హైకోర్టు, హిమాచల్ ప్రదేశ్ సర్కారును కేసును సీబీఐ విచారణకు అప్పజెప్పాలని ఆదేశించింది. రాష్ట్ర గవర్నర్ సైతం విషయంపై సీరియస్ అయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నూతన రాష్ట్రపతికి ఇవ్వనున్న కానుక......