Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌లో భారీ వర్షాలు - 15 మంది మృత్యువాత

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (12:27 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ (డీవీసీ) ఆధ్వర్యంలోని పంచెట్, మైథాన్‌ ఆనకట్టల నుంచి నీటిని విడుదల చేయడంతో ఆరు జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ఈ జిల్లాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
తూర్పు వర్ధమాన్, పశ్చిమ వర్ధమాన్, పశ్చిమ మెదినీపుర్, హూగ్లీ, హావ్‌డా, దక్షిణ 24 పరగణాలు జిల్లాల్లో చాలా ప్రాంతాలు మంగళవారం జలదిగ్బంధమయ్యాయి. కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయారని, 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు. 
 
మరోవైపు, సీఎం మమతా బెనర్జీ వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం విహంగ వీక్షణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. కేంద్రం ఆధ్వర్యంలోని డీవీసీ కావాలనే ఆనకట్టల నుంచి నీటిని ఎక్కువస్థాయిలో విడుదల చేసిందని, దీనివల్లే కృత్రిమ వరద ఏర్పడిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి సౌమెన్‌ మహాపాత్ర ఆరోపించారు.
 
ఇదిలావుంటే, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌-చంబల్‌ ప్రాంతంలో మంగళవారం కుంభవృష్టి కురిసింది. దీంతో 1,171 గ్రామాలు ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా శివ్‌పురి, షియోపుర్‌ జిల్లాల్లో మునుపెన్నడూ లేని రీతిలో 800 మి.మీ. వర్షపాతం నమోదైంది. 200 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. దటియా నుంచి రత్నగఢ్‌ ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న వంతెన కొట్టుకుపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments