Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రకాశంకు పోటెత్తిన వరద నీరు.. : జిల్లా యంత్రాంగం హెచ్చరిక

ప్రకాశంకు పోటెత్తిన వరద నీరు.. : జిల్లా యంత్రాంగం హెచ్చరిక
, సోమవారం, 2 ఆగస్టు 2021 (14:33 IST)
ప్రకాశం జిల్లాకు వరద నీరు పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరదనీటి ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో నదిపై ఉన్న అన్ని డ్యామ్‌ల నీటిమట్టాలు పూర్తిస్థాయికి చేరుకున్నాయి. 
 
ఇన్ ఫ్లో ఎక్కువగా ఉన్న క్రమంలో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల రిజర్వాయర్ల నుంచి గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీటి ఉద్ధృతి పెరుగుతోంది. ఈ సాయంత్రానికి బ్యారేజీకి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
 
ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరీవాహక ప్రాంతంలో ఉండే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళలో కొవిడ్‌ వైరస్ కల్లోలం - మళ్లీ వైరస్​ విజృంభణ