Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 ఏళ్ల బాలికపై అఘాయిత్యం.. ఆపై చెట్టుకు ఉరేశారు..

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (12:23 IST)
మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన దుండగులు.. అనంతరం చెట్టుకు ఉరేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో బాలిక తల్లి సమీప అడవిలోకి వెళ్లింది. తల్లిని అనుసరిస్తూ బాలిక కూడా వెళ్లింది. అయితే తల్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి చిన్నారి కనిపించలేదు. దీంతో తమ బిడ్డ తప్పిపోయిందని గ్రామస్తులకు తల్లిదండ్రులు తెలిపారు. కొన్ని గంటల పాటు అడవిలో ఆ బిడ్డ కోసం గాలింపు చేశారు. చివరకు ఓ చెట్టుకు బాలిక వేలాడుతూ ఉండటాన్ని చూసి గ్రామస్తులు షాక్ అయ్యారు. ఆమె చేతులు కట్టేసి ఉంచారు.
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మైనర్‌పై లైంగికదాడికి పాల్పడి ఉరేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికపై సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం