Webdunia - Bharat's app for daily news and videos

Install App

13 పెళ్లిళ్లు, శోభనం గది నుంచి పారిపోయి 14వ పెళ్ళి చేసుకుంటూ వుండగా?

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (17:18 IST)
పెళ్ళి అంటే జీవితంలో ఒకేసారి వచ్చే అద్భుత ఘట్టం. కాబోయే భర్తతో జీవితాన్ని ఎంతో గొప్పగా ఊహించుకుంటారు అమ్మాయిలు. కానీ కొంతమంది డబ్బు కోసం వివాహ బంధాన్ని వాడుకుంటూ ఉన్నారు. సరిగ్గా 21 యేళ్ళు కూడా లేని యువతి ఏకంగా 13 మందిని వివాహం చేసుకుంది. మరొకరిని పెళ్ళాడేందుకు సిద్థమైంది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
 
ఆమె ఓ నిత్యపెళ్ళి కూతురు. 21 యేళ్ళకే 13 మంది యువకులను మోసం చేసింది. ఆ సంఖ్యను మరింత పెంచేందుకు సిద్థమైంది. కానీ సీన్ రివర్స్ అయ్యి అరెస్టయ్యింది. పెళ్ళి పేరుతో మోసం చేస్తున్న సోను అనే యువతిపై ఆమెను పెళ్లిచేసుకున్నవారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
 
హింగోలి జిల్లా సాదా అనే ప్రాంతానికి చెందిన సోను అనే యువతికి భూషణ్ అనే యువకుడితో మే 6వ తేదీన వివాహం జరిగింది. కొన్నిరోజుల పాటు అతనితో సంతోషంగా ఉంది. అయితే మే 19వ తేదీన ఇంటి నుంచి పారిపోయింది. భర్త, అతని తరపు బంధువులు ఆమెను వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో సోను సోదరుడికి వారు ఫోన్ చేయగా తన వద్ద లేదని తెలిపాడు.
 
ఆ తర్వాత అతడు ఫోన్‌ను స్విచ్చాఫ్ చేశాడు. దీంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు భూషణ్. మరోవైపు సోను మరో యువకుడితో పెళ్ళికి సిద్ధమైంది. అయితే పెళ్ళిపీటల దగ్గరకు పోలీసులు వస్తున్నారని తెలుసుకుని పరారైంది. అక్కడి నుంచి పారిపోయి దులేబాద్ అనే ప్రాంతానికి చేరుకుంది. అయితే నిత్యపెళ్ళికూతురు దులేబాద్ ప్రాంతంలో ఉన్నారని సమాచారం రావడంతో పోలీసులు చాకచక్యంగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments