Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్ణాటక సీఎంకు ఓ వ్యక్తి లేఖ.. లో దుస్తులు కొనుక్కోవాలి.. షాపులు తెరవండి..

కర్ణాటక సీఎంకు ఓ వ్యక్తి లేఖ.. లో దుస్తులు కొనుక్కోవాలి.. షాపులు తెరవండి..
, బుధవారం, 2 జూన్ 2021 (16:28 IST)
కర్ణాటక సీఎంకు ఓ వ్యక్తి లేఖ రాశాడు. ఈ లేఖ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలో ముందుగా మే 10 నుంచి 24వ తేదీ వరకు రెండు వారాలు లాక్ డౌన్ ప్రకటించినా కేసుల ఉద్ధృతితో దానిని పొడిగించారు. దీంతో ప్రస్తుతం జూన్ 7 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. 
 
జూన్ 7 తర్వాత కూడా కర్ణాటకలో మరోసారి లాక్ డౌన్ పొడిగించే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతో ఓ వ్యక్తి సీఎం యెడియూరప్పకు ఓ లేఖ రాశాడు. ఆ లేఖ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. తన లోదుస్తులు పూర్తిగా పాడయ్యాయని.. వాటిని కొనుక్కునేందుకు షాపులు తెరిపించాలని ఆ లేఖలో రాశాడు. చామరాజపురానికి చెందిన నరసింహమూర్తి ఈ లేఖలో తన బాధను రాసుకొచ్చాడు.
 
మీకు నా వినతి కాస్త వింతగా అనిపించొచ్చు. కానీ నాకున్న జత బనియన్లు, అండర్ వేర్లు పూర్తిగా చిల్లులు పడ్డాయి. గత రెండు వారాల నుండి కొత్తవి కొనుక్కోవాలని అనుకున్నా లాక్ డౌన్ నేపథ్యంలో షాపులు తెరవడం లేదు. 
 
ఇప్పుడు మరోసారి లాక్ డౌన్ కొనసాగిస్తారని ప్రచారం జరుగుతుంది. అలా కొనసాగించే పక్షంలో వారానికి ఒకసారైనా షాపులు కొద్ది గంటలపాటు తీసినా నాలాంటి వారికి ఇన్ని ఇబ్బందులు లేకుండా ఉంటుందని ఈ లేఖలో పేర్కొన్నాడు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా రోగులకు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్‌ను అందించిన కలెక్టర్ ఇంతియాజ్