Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో ముగియనున్న లాక్డౌన్ ఆంక్షలు : నేడు సీఎం జగన్ నిర్ణయం!

ఏపీలో ముగియనున్న లాక్డౌన్ ఆంక్షలు : నేడు సీఎం జగన్ నిర్ణయం!
, సోమవారం, 31 మే 2021 (12:19 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా, కర్ఫ్యూ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూ ఆంక్షలు సోమవారంతో ముగియనున్నాయి. ఈ ఆంక్షల పొడిగింపుపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం నిర్ణయం తీసుకోనున్నారు. 
 
మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన అనంతరం కోవిడ్‌పై సీఎం సమీక్షించనున్నారు. కేసులు తగ్గుముఖం పట్టినా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 
 
ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. అదే విధానాన్ని కొనసాగిస్తారా? లేక మరో గంట సమయం సడలింపు ఇస్తారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిజమైన కోవిడ్ వారియర్స్ జర్నలిస్టులే : సునీల్ దియోదర్