Webdunia - Bharat's app for daily news and videos

Install App

చరిత్రలో కలుస్తున్న 135 ఏండ్ల సెంట్రల్ జైలు

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (16:46 IST)
హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ పక్కనే ఉన్న సచివాలయం నేలమట్టమైంది. ఇప్పుడు అదేబాటలో తెలంగాణ రాష్ట్రంలో మరో చరిత్రాత్మక కట్టడం కనుమరుగు కానుంది. 35 ఏళ్ల కాలం నాటి వరంగల్ ప్రాంతీయ కారాగారం కథ ముగిసిపోతోంది. సెంట్రల్ జైలు ఉన్న ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని తలపెట్టిన కేసీఆర్ సర్కార్ చకాచకా అడుగులు వేస్తోంది. 
 
సర్కార్ ఆదేశాలతో జైలును అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. వరంగల్ సెంట్రల్ జైలు అధికారులు, సిబ్బంది ఖైదీలను తరలించే పని మొదలుపెట్టారు. మంగళవారం తొలి రోజు పటిష్ట భద్రత నడుమ 119 మంది ఖైదీలను హైదరాబాద్ చర్లపల్లికి తరలించారు. అందులో 80 మంది పురుషులు 39 మంది మహిళా ఖైదీలు ఉన్నారు.
 
జైలు నుంచి తరలి వెళ్లే సమయంలో పలువురు మహిళా ఖైదీలు కంటతడి పెట్టారు. జైలులో వెయ్యి మంది ఉండేలా ఏర్పాట్లు ఉండగా, ప్రస్తుతం 27 బ్యారక్​లలో 956 మంది జైలులో ఉన్నారు. బ్యారక్‌లే కాకుండా అధికారులకు, సిబ్బందికి వసతి గృహాలు కూడా లోపలే నిర్మించారు. 
 
ఖైదీల ఆరోగ్య పరిరక్షణకు 70 పడకల ఆస్పత్రి కూడా ఉంది. వరంగల్ కేంద్ర కారాగారంలోని ఖైదీలను హైదరాబాద్​లోని చర్లపల్లి, చంచల్​గూడాతో పాటు ఖమ్మం, మహబూబాబాద్, నిజామాబాద్, అదిలాబాద్ జైళ్లకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments