సికింద్రాబాద్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిగా దానం నాగేందర్!

ఠాగూర్
గురువారం, 21 మార్చి 2024 (22:43 IST)
ఇటీవల భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్‌కు జాక్‌పాట్ తగిలింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఈ  మేరకు కాంగ్రెస్ పార్టీ గురువారం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆయనకు సీటు కేటాయించింది. అలాగే, పెద్ద పల్లి నుంచి వంశీకృష్ణ, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవిలు పోటీ చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ స్థానంగా గుర్తింపు పొందిన మల్కాజ్‌గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. 
 
తాజాగా ఐదుగురు అభ్యర్థుల పేర్లను మాత్రమే ప్రకటించింది. ఇంకా మరో 8 నియోజకవర్గాలకు అభ్యర్థులను పెండింగ్‌లో ఉంచింది. వీటిలో మెదక్, ఖమ్మం, భునవగిరి, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సివుంది. దీంతో ఈ స్థానాల్లో అభ్యర్థుల ఖరారు విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. అలాగే, లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 57మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ కీలక నేత అధిర్ రంజన్ చౌదరి వెస్ట్ బెంగాల్‌లోని బెర్హం‌పూర్ నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments