Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిగా దానం నాగేందర్!

ఠాగూర్
గురువారం, 21 మార్చి 2024 (22:43 IST)
ఇటీవల భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్‌కు జాక్‌పాట్ తగిలింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఈ  మేరకు కాంగ్రెస్ పార్టీ గురువారం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆయనకు సీటు కేటాయించింది. అలాగే, పెద్ద పల్లి నుంచి వంశీకృష్ణ, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవిలు పోటీ చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ స్థానంగా గుర్తింపు పొందిన మల్కాజ్‌గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. 
 
తాజాగా ఐదుగురు అభ్యర్థుల పేర్లను మాత్రమే ప్రకటించింది. ఇంకా మరో 8 నియోజకవర్గాలకు అభ్యర్థులను పెండింగ్‌లో ఉంచింది. వీటిలో మెదక్, ఖమ్మం, భునవగిరి, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సివుంది. దీంతో ఈ స్థానాల్లో అభ్యర్థుల ఖరారు విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. అలాగే, లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 57మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ కీలక నేత అధిర్ రంజన్ చౌదరి వెస్ట్ బెంగాల్‌లోని బెర్హం‌పూర్ నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ మూవీలో మత్తుకళ్ళ మోనాలిసా!!?

దర్శకుడు రాంగోపాల్ వర్మకు జైలుశిక్ష... ఎందుకో తెలుసా?

సింగర్‌గా మారిపోయిన డాకు మహారాజ్.. పాట పాడిన బాలయ్య (video)

చిరంజీవి అభిమానిని అన్నా బాలకృష్ణ గారు ఎంతో ప్రోత్సహించారు : దర్శకుడు బాబీ కొల్లి

నా కలెక్షన్స్ ఒరిజినల్, నా అవార్డ్స్ ఒరిజినల్, నా రివార్డ్స్ ఒరిజినల్ : నందమూరి బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

తర్వాతి కథనం
Show comments