Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లెమ్మ దెబ్బకు అన్నయ్యకు నిద్రలేని రాత్రులు .. వణికిపోతున్న తాడేపల్లి ప్యాలెస్!!

PNR
బుధవారం, 20 మార్చి 2024 (15:59 IST)
సొంతచెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్.షర్మిల తన అన్న, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి నిద్రలేకుండా చేస్తున్నారు. గత 2019లో జరిగిన ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చేందుకు ఎంతో సాయం చేసిన చెల్లి షర్మిల.. ఇపుడు తమ పార్టీ ఓటమికి కారకురాలవుతారన్న భయంతో తాడేపల్లి ప్యాలెస్ పాలకులు వణికిపోతున్నారట. గత ఐదేళ్ళుగా వైకాపా అధికారంలో ఉంది. పైగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజావ్యతిరేక ఉంది. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైవు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. అదేసమయంలో వైఎస్ షర్మిల రూపంలో కూడా వైకాపాకు ఎంతో కొంత నష్టం జరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. 
 
ప్రస్తుతం వైకాపాలో షర్మిలను అభిమానించేవారు ఉన్నారు. అయితే, తాజాగా విశాఖపట్టణంలో కాంగ్రెస్ నిర్వహించిన సభతో ఆ పార్టీకి జవజీవాలు కల్పించారనే చర్చ సాగుతుంది. దీంతో వైకాపా ఓటు బ్యాంకులో 2 శాతం కాంగ్రెస్ పార్టీకి మళ్లినా... తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వైకాపాలో కనిపిస్తుంది. అదే జరిగితే వైకాపాకు ఓటమి తథ్యమని వైకాపా నేతలే తమ అంతర్గత చర్చల్లో వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకు మొదలైందనే చర్చ జరుగుతుంది. వైకాపాపై షర్మిల ప్రభావం ఏ మేరక ఉందనేది ఎన్నికల ఫలితాలతో తేలనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments