Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాధారణ పౌరుడిలా క్యూలో నిలబడి ఓటేసిన కేరళ ముఖ్యమంత్రి

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (11:24 IST)
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సాధారణ పౌరుడిలా మారిపోయాడు. ఆయన సాధారణ పౌరులు నిలబడినట్టుగానే క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
సాధారణంగా వామపక్ష పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు నిరాడంబరతకు మారుపేరు. పేరుకు అధికారంలో ఉన్నప్పటికీ.. ఆ దర్పాన్ని ఎక్కడా ప్రదర్శించరు. పార్టీ నిబంధనలను ఏమాత్రం ఉల్లఘించరు. దీంతో పాటు.. వ్యక్తిగత క్రమశిక్షణలో ముందువరుసలో ఉంటారు. ఎంత పెద్ద పదవిలో ఉన్నా తామూ ప్రజల్లో భాగమన్న అభిప్రాయం వారిలో బలంగా ఉంటుంది. దీనికి ఉదాహరణ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌. 
 
మూడో విడత పోలింగ్‌లో భాగంగా తన రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఆయన సోమవారం ఓటు వేశారు. ఓటు హక్కు ఉన్న కన్నూరు జిల్లాలోని పినరయిలోని ఆర్సీ అమల బేసిక్‌ యూపీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌కు విచ్చేశారు. భారీ క్యూ ఉన్నప్పటికీ సాధారణ పౌరుని మాదిరిగా క్యూలో నిల్చున్నారు. 
 
తనవంతు వచ్చినప్పుడు బూత్‌లోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి నిరాడంబరత్వాన్ని పలువురు అభినందించారు. మూడో విడత ఎన్నికల పోలింగ్‌లో భాగంగా సోమవారం వివిధ రాష్ట్రాల్లోని మొత్తం 116 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments