Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదుల ఆయుధం కంటే ప్రజల చేతిలోని ఓటు శక్తివంతం : నరేంద్ర మోడీ

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (10:13 IST)
పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా ఆనందంగా ఉందనీ, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. 
 
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం దేశవ్యాప్తంగా మూడో దశ పోలింగ్ జరుగుతోంది. ఇందులోభాగంగా, గుజరాత్‌లోని అన్ని లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన సొంతూరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ పాఠశాల బూత్‌లో ఆయన ఓటు వేశారు. 
 
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, ఓటు హక్కు వినియోగించుకుని తన కర్తవ్యాన్ని పూర్తి చేశానని చెప్పారు. కుంభమేళాలో పాల్గొన్నంత ఆనందంగా ఉందని.. పవిత్ర స్నానం తర్వాత ఎలాగైతే స్వచ్ఛతను పొందుతామో.. ఓటు వేసిన అనంతరం అలాంటి అనుభూతినే పొందుతామన్నారు. భారతీయ ఓటర్లు తెలివైనవారని.. ఎవరు సమర్థంగా పనిచేస్తారో వారికి తెలుసని మోడీ అన్నారు. 
 
'ఉగ్రవాదుల ఆయుధం ఎల్‌ఈడీ. ప్రజల ఆయుధం ఓటు. ఎల్‌ఈడీ కంటే ఓటే శక్తవంతం. అసలైన ఆయుధం ప్రజల వద్దే ఉంది. ఓటు సామర్థ్యాన్ని తెలుసుకోవాలి' అన్నారు. 21వ శతాబ్దంలో పుట్టినవారు ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేయబోతున్నారన్న మోడీ.. తమ భవిష్యత్త కోసం వారు ఖచ్చితంగా ఓటేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments