Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లిం ఓట్లు చీల్చవద్దంటూ సిద్ధూ వ్యాఖ్యలు.. ప్రచారంపై ఈసీ నిషేధం

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (09:58 IST)
కాంగ్రెస్ నేత, పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ముస్లిం ఓట్లు చీల్చవద్దంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పరిగణించిన ఎన్నికల సంఘం ఆయనపై 72 గంటలపాటు ప్రచారంపై నిషేధం విధించింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్‌లోని కతిహార్‌లో సిద్ధూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముస్లింలు ఓట్లు చీల్చవద్దని కోరారు. 'నేను ముస్లిం సోదరులకు ఒక విషయం చెప్పదలిచాను. అసదుద్దీన్ ఒవైసీ వంటి నేతలను ఇక్కడికి తీసుకొచ్చి మిమ్మల్ని విభజించాలని చూస్తున్నారు. కొత్త పార్టీ పెట్టి మీ ఓట్లు చీల్చి, విజయం సాధించాలని చూస్తున్నారు' అని  వ్యాఖ్యానించారు. 
 
ఇక్కడ ముస్లిం జనాభా 65 శాతం ఉందని, అందరూ ఐక్యంగా ఉండటం వల్ల మైనారిటీలు కాస్తా మెజారిటీగా ఉండొచ్చన్నారు. అదే జరిగితే పరిస్థితుల్లో మార్పు వస్తుందని, ప్రధాని నరేంద్ర మోడీ ఓడిపోతారంటూ జోస్యం చెప్పారు. దీనిపై బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సిద్ధూ ప్రసంగం ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉందంటూ అందులో పేర్కొంది. సిద్ధు వ్యాఖ్యలను ఎన్నికల సంఘం ఖండిస్తూనే, 72 గంటలపాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments