Webdunia - Bharat's app for daily news and videos

Install App

షియోమీ నుండి 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది..

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (13:52 IST)
మొబైల్ రంగంలో ప్రస్తుతం 4జీ హవా నడుస్తోంది. అయితే అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో 5జీ సౌకర్యాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారులకు మరింత వేగవంతమైన నెట్‌వర్క్‌ని అందించేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే మొబైళ్ల తయారీ, అమ్మకాల్లో కూడా అదే ఊపు కనిపిస్తోంది.
 
ప్రస్తుతం 4జీ కంటే మరింత మెరుగ్గా 5జీ సేవలను అందించేందుకు కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. భారత మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతున్న షియోమి తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్‌లో షియోమీ 5జీ రెడీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. 
 
ముందుగా ఊహించినట్లుగానే 5జీ వర్షన్ ఎంఐ మిక్స్ 3ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడే మార్కెట్‌లోకి రాదు. ఇది మే నెలలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌‌కి సంబంధించి ర్యామ్, స్టోరేజీ వివరాలు తెలియాల్సి ఉంది.
 
ఎంఐ మిక్స్ 3 ప్రత్యేకతలు:
డిస్‌ప్లే: 6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే, 
19.5:9 యాస్పెక్ట్ రేషియో, 
2,340 x 1,080 స్క్రీన్ రిజల్యూషన్
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 855
బ్యాటరీ: 3,800 ఎంఏహెచ్
రియర్ కెమెరా: 12+12 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 24+2 మెగాపిక్సెల్ కెమెరా
ధర: సుమారు రూ.48,000 ఉండవచ్చు

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments