షియోమీ నుండి 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది..

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (13:52 IST)
మొబైల్ రంగంలో ప్రస్తుతం 4జీ హవా నడుస్తోంది. అయితే అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో 5జీ సౌకర్యాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారులకు మరింత వేగవంతమైన నెట్‌వర్క్‌ని అందించేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే మొబైళ్ల తయారీ, అమ్మకాల్లో కూడా అదే ఊపు కనిపిస్తోంది.
 
ప్రస్తుతం 4జీ కంటే మరింత మెరుగ్గా 5జీ సేవలను అందించేందుకు కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. భారత మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతున్న షియోమి తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్‌లో షియోమీ 5జీ రెడీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. 
 
ముందుగా ఊహించినట్లుగానే 5జీ వర్షన్ ఎంఐ మిక్స్ 3ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడే మార్కెట్‌లోకి రాదు. ఇది మే నెలలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌‌కి సంబంధించి ర్యామ్, స్టోరేజీ వివరాలు తెలియాల్సి ఉంది.
 
ఎంఐ మిక్స్ 3 ప్రత్యేకతలు:
డిస్‌ప్లే: 6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే, 
19.5:9 యాస్పెక్ట్ రేషియో, 
2,340 x 1,080 స్క్రీన్ రిజల్యూషన్
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 855
బ్యాటరీ: 3,800 ఎంఏహెచ్
రియర్ కెమెరా: 12+12 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 24+2 మెగాపిక్సెల్ కెమెరా
ధర: సుమారు రూ.48,000 ఉండవచ్చు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments