Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో మూడు కార్యాలయాలను మూసివేసిన ట్విట్టర్

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (16:17 IST)
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తన కార్యాలయాలను మూసేసుకుంటూ వస్తుంది. తాజాగా భారత్‌లో రెండు ఆఫీసులను మూసివేసింది. ఇక మిగిలింది ఒకే ఒక్క కార్యాలయం మాత్రమే. అది కూడా బెంగుళూరులో ఉంది. భారత్‌లోని మొత్తం ట్విట్టర్ సిబ్బందిలో 90 శాతం మంది ఉద్యోగులను ప్రభుత్వం తొలగించింది. సంస్థ మొత్తం సిబ్బందిలో వీరి వాటా 90 శాతమని ఓ అంచనా వేశారు. ఇక బెంగుళూరు శాఖలోని సిబ్బందిలో అత్యధికులు ఇంజనీర్లేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
మరోవైపు, ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్.. సంస్థను లాభాల బాటలో పట్టించేందుకు తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకున్న విషయం తెల్సిందే. 2023 నాటికి సంస్థకు ఆర్థిక స్థిరత్వం ఇవ్వాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులోభాగంగా, అదనపు సిబ్బందితో పాటు అదనపు కార్యాలయాలను మూసివేస్తూ వచ్చారు. 
 
ఇందులోభాగంగా, భారత్‌లోని ఉన్న మూడు కార్యాలయాల్లో రెండింటిని మూసివేశారు. భారత్‌లో ట్విట్టర్ ప్రజాభిప్రాయం, వ్యక్తీకరణ, రాజకీయ చర్చలకు కీలక వేదికగా మారింది. ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్ర మోడీకి ఏకంగా 86.5 మిలియన్ ఫాలోయర్లు ఉన్న విషయం తెల్సిందే. అయితే, మొత్తం ట్విట్టర్ ఆదాయంలో భారత్ వాటా స్వల్పంగా ఉన్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments