Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో మూడు కార్యాలయాలను మూసివేసిన ట్విట్టర్

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (16:17 IST)
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తన కార్యాలయాలను మూసేసుకుంటూ వస్తుంది. తాజాగా భారత్‌లో రెండు ఆఫీసులను మూసివేసింది. ఇక మిగిలింది ఒకే ఒక్క కార్యాలయం మాత్రమే. అది కూడా బెంగుళూరులో ఉంది. భారత్‌లోని మొత్తం ట్విట్టర్ సిబ్బందిలో 90 శాతం మంది ఉద్యోగులను ప్రభుత్వం తొలగించింది. సంస్థ మొత్తం సిబ్బందిలో వీరి వాటా 90 శాతమని ఓ అంచనా వేశారు. ఇక బెంగుళూరు శాఖలోని సిబ్బందిలో అత్యధికులు ఇంజనీర్లేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
మరోవైపు, ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్.. సంస్థను లాభాల బాటలో పట్టించేందుకు తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకున్న విషయం తెల్సిందే. 2023 నాటికి సంస్థకు ఆర్థిక స్థిరత్వం ఇవ్వాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులోభాగంగా, అదనపు సిబ్బందితో పాటు అదనపు కార్యాలయాలను మూసివేస్తూ వచ్చారు. 
 
ఇందులోభాగంగా, భారత్‌లోని ఉన్న మూడు కార్యాలయాల్లో రెండింటిని మూసివేశారు. భారత్‌లో ట్విట్టర్ ప్రజాభిప్రాయం, వ్యక్తీకరణ, రాజకీయ చర్చలకు కీలక వేదికగా మారింది. ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్ర మోడీకి ఏకంగా 86.5 మిలియన్ ఫాలోయర్లు ఉన్న విషయం తెల్సిందే. అయితే, మొత్తం ట్విట్టర్ ఆదాయంలో భారత్ వాటా స్వల్పంగా ఉన్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments