Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విరిగిపడిన కొండచరియలు.. 36 మంది మృత్యువాత

Advertiesment
landslides
, మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (10:51 IST)
దక్షిణ అమెరికాలో పెను విషాదం నెలకొంది. ప్రకృతి ప్రకోపం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 36 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. సౌత్ అమెరికాలోని పెరూలో ప్రతి యేటా ఫిబ్రవరి నెలలో విస్తారంగా వర్షాలు కురుస్తుంటాయి. ఈ యేడాది కూడా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, దక్షిణ పెరూలోని క్యామనా ప్రావిన్స్‌లో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. 
 
ఈ వర్షాల ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కొండ దిగువున ఉన్న గ్రామాలకు భారీ నష్టం కలుగుతోంది. పెద్ద రాళ్లు, మట్టి వంటవి పడటంతో అనేక మంది చనిపోతున్నారు. అనేక గృహాలు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. కొండ చరియలు విరిగిపడుతున్న ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. 
 
అలాగే, క్షతగాత్రులను రక్షించి ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. అధికారుల అంచనా ప్రకారం ఈ కొండ చరియలు విరిగి పడటం వల్ల దాదాపు 700కి పైగా గృహాలు దెబ్బతిన్నట్టు తెలిపారు. బాధిత ప్రాంతాల్లో తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసి హెలికాఫ్టర్ల ద్వారా ఆహారం, నీటిని సరఫరా చేస్తున్నారు. కాగా, ఈ స్థాయిలో కొండ చరియలు విరిగిపడటం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి అని వారు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకపై మిగ్ 29 యుద్ధ విమానాల ల్యాండింగ్