Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాంసంగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. గెలాక్సీ ఏ80పై రూ.30వేల తగ్గింపు

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (19:57 IST)
Samsung Galaxy A80
స్మార్ట్ ఫోన్ యూజర్లకు శాంసంగ్ గుడ్ న్యూస్ చెప్పింది. శాంసంగ్ తన గెలాక్సీ ఏ80 స్మార్ట్ ఫోన్‌పై భారీ ధర తగ్గింపును ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న లిస్టింగ్ ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.52,000. అయితే ఈ ఫోన్‌పై రూ.30,001లను తగ్గించారు. దీంతో ఈ ఫోన్ ఇప్పుడు రూ.21,999కే అందుబాటులో ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం బిగ్ సేవింగ్స్ డే జరుగుతోంది. ఈ భారీ తగ్గింపు ఇందులో భాగమా అనేది ఇంకా తేలలేదు.
 
ఈ ఫోన్ కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, మరో 8 మెగా పిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఏంజెల్ గోల్డ్, ఘోస్ట్ వైట్, ఫాంటం బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. వైఫై, జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ, 3జీ, 4జీలను ఇది సపోర్ట్ చేస్తుంది. 
 
గెలాక్సీ ఏ80 స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల సంగతికి వస్తే..?
 
6.7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే,
ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 730జీ ప్రాసెసర్,
8 జీబీ ర్యామ్, బ్యాటరీ సామర్థ్యం 3700 ఎంఏహెచ్
వెనకవైపు కెమెరాలో ఆటోఫోకస్ ఫీచర్‌
 
ఇందులో 128 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్
ఫేస్ అన్ లాక్ ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.
ఇంకా రెండు నానోసిమ్‌లను అమర్చే సిమ్ ట్రేను కలిగివుంటుంది.

సంబంధిత వార్తలు

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం టైటిల్ గా కూలీ

హనుమాన్ జయంతి సందర్భంగా జై హనుమాన్ IMAX 3D న్యూ పోస్టర్ విడుదల

సాయి దుర్గ తేజ్ ఆవిష్కరించిన పడమటి కొండల్లో ఫస్ట్ లుక్

తెలుగు కథతో సీతా కళ్యాణ వైభోగమే పెద్ద విజయం సాధిస్తుంది: ప్రీ రిలీజ్ లో వక్తలు

సందీప్ కిషన్, రావు రమేష్ ప్రధాన పాత్రలతో త్రినాధ రావు నక్కిన చిత్రం ప్రారంభం

డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?

రాత్రులు చాక్లెట్లు, ఐస్ క్రీమ్‌లు తింటున్నారా.. ఐతే అదే కారణం?

కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయని చెప్పే 7 సంకేతాలు

ఐస్ క్రీమ్ తింటే అనర్థాలు కూడా వున్నాయ్, ఏంటవి?

233వ స్టోర్‌ను తెలంగాణలో ప్రారంభించిన వెస్ట్‌సైడ్

తర్వాతి కథనం
Show comments