స్మార్ట్ ఫోన్ యూజర్లకు శాంసంగ్ గుడ్ న్యూస్ చెప్పింది. శాంసంగ్ తన గెలాక్సీ ఏ80 స్మార్ట్ ఫోన్పై భారీ ధర తగ్గింపును ప్రకటించింది. ఫ్లిప్కార్ట్లో ఉన్న లిస్టింగ్ ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.52,000. అయితే ఈ ఫోన్పై రూ.30,001లను తగ్గించారు. దీంతో ఈ ఫోన్ ఇప్పుడు రూ.21,999కే అందుబాటులో ఉంది. అయితే ఫ్లిప్కార్ట్లో ప్రస్తుతం బిగ్ సేవింగ్స్ డే జరుగుతోంది. ఈ భారీ తగ్గింపు ఇందులో భాగమా అనేది ఇంకా తేలలేదు.
ఈ ఫోన్ కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, మరో 8 మెగా పిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఏంజెల్ గోల్డ్, ఘోస్ట్ వైట్, ఫాంటం బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. వైఫై, జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ, 3జీ, 4జీలను ఇది సపోర్ట్ చేస్తుంది.