Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో చికెన్ వండవద్దని చెప్పిన భార్య.. పట్టుబట్టిన భర్త.. చివరికి?

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (19:43 IST)
అసలే లాక్ డౌన్. కొత్త జంట వేరే. హ్యాపీగా వుంటారనుకుంటే.. చికెన్ వండలేదనే దానిపై గొడవపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. భర్తకు చికెన్ వడ్డించడంలో గొడవపడిన అనంతరం కొత్తజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అస్సాంలోని లఖింపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో భార్య మరణించగా, భర్త పరిస్థితి విషమంగా వుందని ఇసానగర్ పోలీసులు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. లఖింపూర్‌కు చెందిన గురు దయాళ్‌(22), రేష్మా(19)ను జూన్‌ 19న వివాహం చేసుకున్నాడు. రేష్మా వెజిటేరియన్‌ కావడంతో తన భర్త సోమవారం చికెన్‌ తీసుకువచ్చి తల్లికి వండమని ఇచ్చాడు. అది చూసిన రేష్మా ఇంట్లో చికెన్‌ వండటానికి వీలు లేదని, బయట వండుకొమ్మని భర్తకు చెప్పింది. అయినా అతడు వినిపించుకోకుండా ఇంట్లోనే వండమని తన తల్లికి చెప్పాడు. 
 
దీనిపై రేష్మాకు గురుల మధ్య గొడవ జరిగింది. అనంతరం కొత్త జంట రాత్రి ఇంట్లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిని చూసిన గురుదయాళ్‌ తండ్రి శివనాథ్‌ ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పోందుతూ రేష్మా మరణించింది. 
 
ప్రస్తుతం గురుదయాళ్‌ పరిస్థితి విషయంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని, గురుదయాళ్ ఆరోగ్యం మెరుగుపడ్డాక అతడి వాంగ్మూలం తీసుకున్నాకే కేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments