చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ షియోమీ నుంచి మరో అద్భుతమైన ఫోన్ వచ్చేస్తోంది. కొత్త ఏడాది తొలి వారంలోనే 108 మెగాపిక్సల్ రిజల్యూషన్తో సరికొత్త కెమెరా సెన్సార్తో స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది.
ఈ ఏడాది విడుదలైన ఫ్లాగ్షిప్ ఫోన్లు Mi 10, Mi 10T, Mi 10T Proలకు తర్వాతి వెర్షన్గా ఈ ఫోన్ను లాంచ్ చేస్తున్నారు. Mi 10i 5G అనే ఈ ఫోన్ను భారత్లో జనవరి 5న లాంచ్ చేయబోతున్నట్లు షియోమీ ఇండియా చీఫ్ మను కుమార్ జైన్ తెలిపారు.