Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ సేవలు

జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ సేవలు
, గురువారం, 31 డిశెంబరు 2020 (16:19 IST)
కొత్త సంవత్సరం ఆరంభం కాకముందే ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. జనవరి నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్స్‌ చేసుకోవచ్చునని ప్రకటించింది. 
 
డిసెంబర్ 31తో ఐయూసీ అమలు గడువు ముగుస్తుండటంతో జియో మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఐయూసీ విధానం రద్దయిన తర్వాత మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ సేవలను పునరుద్ధరిస్తామని గతంలో చెప్పినట్లు జియో ప్రకటించింది. 1, 2021 నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా జియో ద్వారా ఉచిత వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు అని ప్రకటించింది. 
 
అయితే ఒక నెట్‌వర్క్‌ నుంచి మరో మొబైల్ నెట్‌వర్క్‌కు ఫోన్ చేసినప్పుడు ఇన్ కమింగ్ నెట్‌వర్క్‌కు కాల్‌ చేసిన నెట్‌వర్క్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జెస్‌ అంటారు. ఈ విధానాన్ని జనవరి 1 2020 నుంచి తొలగించడానికి కేంద్రం సమ్మతించింది. అయితే ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా దీన్ని వ్యతిరేకించడంతో పొడగిస్తూ 2019 సెప్టెంబరులో ట్రాయ్‌ ఆదేశాలు జారీ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాదులో రూ. 4,837 కోట్ల మోసానికి పాల్పడిని కంపెనీ: సీబీఐ కేసు నమోదు