జీ ఎంటర్‌టైన్మెంట్‌పై కన్నేసిన రిలయన్స్ జియో

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (13:25 IST)
ఇప్పటివరకు అంతర్జాతీయ సంస్థలతో మాత్రమే జట్టు కడతామని ప్రకటిస్తూ వచ్చిన జీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రమోటర్‌లు ఇప్పుడు దేశీయ వ్యాపార సంస్థలతో కూడా జట్టు కడతామని ప్రకటించింది. ఆర్థిక ఒడిదిడుకులతో సతమతమవుతున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇలాంటి ప్రకటన చేయడంతో పలు సంస్థలు దీనిపై కన్నేశాయి. 
 
ఇందులో భాగంగా ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో కూడా మరో కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తోంది. టెలికం రంగంలో ఛాలెంజింగ్‌గా దూసుకెళ్తున్న జియో ఇటీవల మీడియా కంటెంట్ విషయంలో కూడా తనదైనశైలిని ప్రదర్శించాలనే ఉద్దేశంతో ప్రణాళికలు రూపొందిస్తోంది. 
 
ఇందు కారణంగానే జియో జీ ఎంటర్‌టైన్‌మెంట్ వాటాని కొనుగోలు చేయాలని నిర్ణయించుకుందని తాజా సమాచారం. జీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రమోటర్ సుభాష్ చంద్ర తన వాటాలను విక్రయించాలని భావిస్తున్నారు. వీటిలో దాదాపు సగభాగాన్ని కొనుగోలు చేసేందుకు రిలయన్స్ జియో ముందుకు వస్తోంది. 
 
ఇదిలావుండగా, ఇప్పటికే జీ ఎంటర్‌టైన్‌మెంట్ వాటాలను కొనుగోలు చేసేందుకు అమేజాన్, యాపిల్, టెన్సెంట్, ఆలీబాబా వంటి ప్రముఖ అంతర్జాతీయ దిగ్గజాలు పోటీలో ఉన్నాయి. వీటితో పాటు ఏటీఅండ్‌టీ, సింగ్‌టెల్, కామ్‌కాస్ట్, సోనీ పిక్చర్స్‌ వంటి సంస్థలు కూడా జాబితాలో ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jin: వైవిధ్యభరితమైన కథతో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ జిన్

బిగ్ బాస్‌కు వెళ్ళడంతో కెరీర్ కోల్పోయాను : కరాటే కళ్యాణి

Pawan Kalyan: పవన్, హరీష్ శంకర్... ఉస్తాద్ భగత్ సింగ్ తాజా అప్ డేట్

Samantha-Raj: సమంత, రాజ్ నిడిమోరు ఫ్యామిలీ ఫోటో వైరల్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments