Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.98 ప్రీ-పెయిడ్ ప్లాన్‌ను తొలగించిన జియో.. కస్టమర్లకు షాక్

Webdunia
మంగళవారం, 19 మే 2020 (19:07 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో వినియోగదారులకు షాకిచ్చింది. రూ.98తో అతి తక్కువగా కలిగిన ప్రీ-పెయిడ్ ప్లాన్‌ను జియో తొలగించింది. ఇంకా 28 రోజుల కాలపరిమితి కలిగిన ఈ ప్లాన్ ధరను ప్రస్తుతం రూ.129కి పెంచేసింది. 
 
ఇక, తొలగించిన రూ. 98 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 300 ఎస్సెమ్మెస్‌లు, 2జీబీ హైస్పీడ్ డేటా, జియో నుంచి జియోకు కాల్స్, ల్యాండ్ లైన్ కాలింగ్ ప్రయోజనాలు వంటి ప్రయోజనాలు 28 రోజుల కాలపరిమితితో లభించేవి.
 
అయితే రూ. 999 ప్లాన్‌ను ప్రారంభించిన నేపథ్యంలో రూ. 98 ప్లాన్‌ను తొలగించింది. రూ. 999 ప్లాన్‌లో రోజుకు 3జీబీ హైస్పీడ్ డేటా 84 రోజుల కాలపరిమితితో ఈ ప్లాన్ అందుబాటులో వుంటుంది.
 
ఇక 98 రూపాయల నుంచి రూ.129కి పెంచిన ప్రీ-పెయిడ్ ప్లాన్ ద్వారా 28 రోజుల వ్యాలీడిటీతో 2జీబీ టోటల్ డేటా, జియో-టు-జియో అన్ లిమిటెడ్ కాల్స్, వెయ్యి నిమిషాల నాన్-జియో కాల్స్, 300 మెసేజ్‌లు లభిస్తాయి. ఇదే ప్రస్తుతం జియో నుంచి అతి తక్కువ ధరతో వినియోగదారులకు లభించే ప్రీ-పెయిడ్ ప్లాన్ అని రిలయన్స్ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

నాలో చిన్నపిల్లాడు ఉన్నాడు, దానికోసం థాయిలాండ్ లో శిక్షణ తీసుకున్నా: తేజ సజ్జా

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments