ఉద్యోగులు ఇపుడే ఆఫీసుకు రావడాన్ని తప్పనిసరి చేయం : ఇన్ఫోసిస్

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (16:56 IST)
కరోనా వైరస్ మహమ్మారి తర్వాత దేశంలోని అనేక ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశాన్ని కల్పించాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పరిస్థితులు చక్కబడినప్పటికీ అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్నే కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగజం ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీకి చెందిన ఉద్యోగులను ఇపుడిపుడే ఆఫీసుకు రావడాన్ని తప్పనిసరి చేయబోమని ఆ కంపెనీ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ స్పష్టం చేశారు. 
 
ప్రస్తుతం తాము అవలంభిస్తున్న హైబ్రిడ్‌ పని విధానం (కొన్ని రోజులు ఇంటి నుంచి.. మరికొన్ని రోజులు ఆఫీసు నుంచి) వల్ల ఎలాంటి ఇబ్బంది రావడం లేదన్నారు. ఈ నేపథ్యంలో దీన్ని మరికొంత కాలం కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. ఖచ్చితంగా ఇన్ని రోజులు ఆఫీసుకు రావాలని కూడా నియమం పెట్టబోమన్నారు.
 
ఇంటి నుంచి పని విధానంపై ఇప్పటి వరకు కంపెనీ తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగుల స్పందన బాగుందన్నారు. ప్రస్తుతం భారత్‌లోని తమ ఆఫీసుల్లో ఏ సమయంలోనైనా 45 వేలకు తగ్గకుండా ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. కొన్ని నెలల క్రితంతో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువన్నారు. పైగా ఇది క్రమంగా పెరుగుతోందన్నారు. అలాగే ఉద్యోగులు ఆఫీసుకు వచ్చేందుకు అన్ని రకాలుగా సహకరిస్తామని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత రెండో పెళ్ళికి సిద్ధమైన బాలీవుడ్ నటుడు...

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments