ఉద్యోగులు ఇపుడే ఆఫీసుకు రావడాన్ని తప్పనిసరి చేయం : ఇన్ఫోసిస్

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (16:56 IST)
కరోనా వైరస్ మహమ్మారి తర్వాత దేశంలోని అనేక ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశాన్ని కల్పించాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పరిస్థితులు చక్కబడినప్పటికీ అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్నే కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగజం ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీకి చెందిన ఉద్యోగులను ఇపుడిపుడే ఆఫీసుకు రావడాన్ని తప్పనిసరి చేయబోమని ఆ కంపెనీ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ స్పష్టం చేశారు. 
 
ప్రస్తుతం తాము అవలంభిస్తున్న హైబ్రిడ్‌ పని విధానం (కొన్ని రోజులు ఇంటి నుంచి.. మరికొన్ని రోజులు ఆఫీసు నుంచి) వల్ల ఎలాంటి ఇబ్బంది రావడం లేదన్నారు. ఈ నేపథ్యంలో దీన్ని మరికొంత కాలం కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. ఖచ్చితంగా ఇన్ని రోజులు ఆఫీసుకు రావాలని కూడా నియమం పెట్టబోమన్నారు.
 
ఇంటి నుంచి పని విధానంపై ఇప్పటి వరకు కంపెనీ తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగుల స్పందన బాగుందన్నారు. ప్రస్తుతం భారత్‌లోని తమ ఆఫీసుల్లో ఏ సమయంలోనైనా 45 వేలకు తగ్గకుండా ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. కొన్ని నెలల క్రితంతో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువన్నారు. పైగా ఇది క్రమంగా పెరుగుతోందన్నారు. అలాగే ఉద్యోగులు ఆఫీసుకు వచ్చేందుకు అన్ని రకాలుగా సహకరిస్తామని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకరత్న దాసరి సమాధిని శుభ్రం చేసిన మంచు మనోజ్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

తర్వాతి కథనం
Show comments