Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలా మోసం చేస్తే ఉద్యోగం నుంచి పీకేస్తాం: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ వార్నింగ్

Advertiesment
infosys
ఉద్యోగం చేస్తూనే ఇతర కంపెనీల్లో పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారి సంఖ్య ఎక్కువయిపోతోందని పలు కంపెనీలు తమ ఉద్యోగుల వైఖరిపై బహిరంగంగానే విమర్శలు గుపిస్తున్నాయి. తాజాగా ఇండిటన్ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

 
కంపెనీలో ఫుల్ టైం ఉద్యోగులుగా కొనసాగుతూ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసేవారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. కంపెనీ నియమావళి ప్రకారం ఇది విరుద్ధమనీ, ఇలా ఒకే సమయంలో రెండు ఉద్యోగాలను చేసేవారిని ఉపేక్షించేది లేదని, ఇలాంటివారిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తామంటూ ఇ-మెయిల్స్ పంపింది.

 
ఉద్యోగం చేస్తూనే పార్ట్ టైమ్ జాబ్ చేసేవారి వల్ల కంపెనీకి నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. ఇలాంటి వారి వల్ల పనితీరులో నాణ్యతలోపం, రహస్య సమాచారం లీకేజీ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపింది. ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు ఇలాంటి ఇ-మెయిల్స్ ఇవ్వడంతో అది కాస్తా ఇప్పుడు ట్రెండింగ్ అయ్యింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్బీఐ బాండ్ల వేలం.. ఏపీకి మరో రూ.వెయ్యి కోట్లు అప్పు