ఏపీలో ఎన్నికలు కోసం పార్టీలు సిద్ధం.. పవన్ బస్సు స్పెషాలిటీ ఏంటంటే?

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (15:34 IST)
ఏపీ ఎన్నికల కోసం అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రజా కార్యక్రమాలతో మమేకమైన ఆ పార్టీ అధినేత పవన్ ఇక బస్సు యాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు. బస్సు యాత్ర కోసం పవన్ ప్రత్యేక బస్సును దగ్గరుండీ మరీ తయారు చేయిస్తున్నారు. ముందుగా దీనిని పూణెలో తయారు చేయించాలని అనుకున్నారు. కానీ హైదరాబాద్ లోనే రెడీ చేస్తున్నారు. అయితే ఈ బస్సుకు అనేక ప్రత్యేకతలు ఏంటంటే?
 
అచ్చం సినిమా క్యారీ వ్యాన్ లా తలపించే ఈ బస్సు చిన్న ఇల్లులా ఉండేలా మార్చుతున్నారు. అంటే ఇంట్లో ఉండే సౌకర్యాలన్నీ ఈ బస్సులోనే ఉంటాయి. 
 
ఈ బస్సులో కనీసం ఆరుగురు వ్యక్తులు సమావేశం కావచ్చు. యాత్ర నిర్వహిస్తున్న సందర్భంలో సమావేశం అవసరమైతే ప్రత్యేకంగా గదికోసం వెతుక్కోకుండా ఇందులోనే ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
 
ఈ బస్సు హై సెక్యూరిటీని కలిగివుంటుంది. అంతేకాకుండా బస్సు యాత్రకు భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నిఘానేత్రం కూడా బస్సుకు అమర్చారు. అంటే బస్సుకు నాలుగు వైపులా సీసీ కెమెరాలు ఉంటాయి. అంతేకాకుండా హై సెక్యూరిటీ విత్ జీపీఎస్ ట్రాకింగ్ ఫిట్ చేస్తున్నారు.
 
ఇక వాహనం లోపల అన్ని సౌకర్యాలతో పాటు వాహనం పైకి వెళ్లేందుకు పవర్ లిప్టింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. ప్రజలతో మాట్లాడేటప్పుడు, వారందరికీ కనిపించేలా సరికొత్త డిజైన్ చేశారు.
 
ఇక సభలో ఉన్నవాళ్లందరికీ వినిపించేలా లెటేస్ట్ సౌండ్ ను డిజైన్ చేశారు. దీంతో పాటు లైటింగ్ సిస్టంను కూడా ఆధునిక పద్ధతులతో అమర్చారు. ఇక ఈ వాహనం రంగు మిలటరీ రంగులో ఉండేలా చూసుకుంటున్నారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments