Webdunia - Bharat's app for daily news and videos

Install App

22 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించిన భారత్

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (16:04 IST)
కేంద్ర ప్రభుత్వం 22 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించింది. నిషేధానికి గురైన వాటిలో 18 దేశీయ యూట్యూబ్ చానళ్లు కాగా, 4 పాకిస్థాన్ యూట్యూబ్ చానళ్లు. దేశభద్రత, ప్రజాక్షేమం దృష్ట్యా నిషేధించినట్టు కేంద్రం వెల్లడించింది. 
 
యూట్యూబ్ చానళ్లనే కాకుండా 3 ట్విట్టర్ ఖాతాలు, ఒక ఫేస్‌బుక్ అకౌంట్, ఒక న్యూస్ వెబ్ సైట్ ను కూడా నిషేధించినట్టు తెలిపింది.
 
దేశ భద్రత దృష్ట్యా కేంద్ం ఈ నిర్ణయం తీసుకుంది. ఆయా యూట్యూబ్ చానళ్లు టీవీ చానళ్ల లోగోలు వాడుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని వివరించింది. 
 
డిజిటల్ మీడియా ద్వారా భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 35 యూట్యూబ్ ఆధారిత న్యూస్ ఛానళ్లు, రెండు వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలని జనవరిలో మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు ఐ అండ్ బి కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు.
 
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021లోని అత్యవసర నిబంధనల కింద సదరు ఛానళ్లను బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు చంద్ర తెలిపారు. 

సంబంధిత వార్తలు

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments