Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీలంక బాటలో భారత్.. సంజయ్ రౌత్‌కు ఊహించని షాక్

Sanjay raut
, మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (15:45 IST)
Sanjay raut
శ్రీలంకలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా వుంది. భారత్ ఆ బాటలోనే పయనిస్తోందని.. తాము నిర్వహించాలని లేకపోతే.. భారత్ పరిస్థితి శ్రీలంక కంటే అద్వానంగా వుంటుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అఖిలపక్ష సమావేశానికి మమతా బెనర్జీ పిలుపునిచ్చారని సంజయ్ రౌత్ అన్నారు. 
 
ఇదిలా ఉంటే... శివసేన పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యులు సంజయ్ రౌత్‌కు ఊహించని షాక్ తగిలింది. ఎంపీ సంజయ్ రౌత్ కు సంబంధించిన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఉన్నఫలంగా దాడులు చేసి సీజ్ చేసింది.
 
వెయ్యి కోట్ల విలువైన పాత్ర చాల్ భూ కుంభకోణంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు చెందిన ఆలీబాగ్‌లోని ఎనిమిది భూములు, ముంబై దాదర్లోని ఓ ఫ్లాట్ ను జప్తు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త జిల్లాల బాదుడు పేరుతో కొత్త బాదుడు