బ్రేకింగ్ న్యూస్.. పబ్‌జీతో పాటు 118 యాప్‌లపై నిషేధం..

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (17:42 IST)
చైనా సరిహద్దుల్లో చేసిన ఓవరాక్షన్‌తో పాటు కరోనాను నియంత్రించడంలో విఫలం కావడంతో గుర్రుగా వున్న మోదీ సర్కారు.. ఇప్పటికే 51 యాప్‌లపై నిషేధం విధించింది. అయినా భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
 
118 చైనా యాప్స్‌ని బాన్ చేస్తూ నిర్ణయం వెల్లడించింది. అందులో పబ్ జీ కూడా ఉంది. తొలి విడతగా 60 వరకు యాప్స్‌ని రెడీ చేసిన కేంద్రం ఇప్పుడు 118 యాప్స్‌ని నిషేధించింది.  
 
కాగా జూన్ నెలలో, టిక్ టాక్, యుసి బ్రౌజర్, వీచాట్ వంటి 59 చైనీస్ మొబైల్ యాప్‌లపై ప్రభుత్వం నిషేధించింది. ఇవి భారతదేశం సార్వభౌమత్వానికి, సమగ్రతకు, రక్షణకు, భద్రతకు నష్టాన్నిస్తాయనే కారణంగా నిషేధం కొరడా ఝుళిపించడం జరిగిందని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments