ట్విట్టర్‌ Vs కేంద్ర ప్రభుత్వం.. గెలుపు ఎవరిది?

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (14:00 IST)
ట్రాక్టర్‌ ర్యాలీలో తలెత్తిన హింసాకాండ నేపథ్యంలో.. కేంద్రం గతంలో రైతులకు సంబంధించి గతంలో 250 ఖాతాలను తొలగించాలని కోరిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఖాతాలను పునరుద్ధరించే అంశంపై ట్విటర్‌కు, కేంద్రానికి మధ్య కసరత్తులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఖలిస్తాన్‌ సానుభూతిపరులతో, పాకిస్థాన్‌ మద్దతు కలిగి వుందని ఆరోపిస్తూ.. రైతుల నిరసనకు సంబంధించిన 1200 ఖాతాలపై వేటు వేయాలంటూ కేంద్రం ట్విట్టర్‌ను కోరింది. భారత్‌లో కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న రైతుల నిరసనల దృష్ట్యా విదేశాల నుండి పనిచేస్తున్న ఈ సంస్థల ట్వీట్లతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ట్విటర్‌ను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 
 
రైతు నిరసనలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ట్విటర్‌ ఇంకా ఈ ఉత్తర్వులపై స్పందించలేదని, ఫిబ్రవరి 4న ఈ జాబితాను కంపెనీకి అందించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ట్విటర్‌ సిఇఒ జాక్‌డోర్సే నిరసనకు మద్దతు ఇచ్చిన కొన్ని ట్వీట్లకు మద్దతు తెలపడంతో .. ఖాతాలను తొలగించకపోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తటస్థ వైఖరిపై ట్విటర్‌ ప్రభుత్వం నుండి విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: మార్చి నెల ఉస్తాద్ గబ్బర్ సింగ్‌కు కలిసి వచ్చేలా వుంది

Sathya: నాగ చైతన్య చిత్రం వృషకర్మ లో సత్య లుక్‌

Srinath: మెన్షన్ హౌస్ మల్లేష్ నిజాయితీగా తీసిన సినిమా: శ్రీనాథ్ మాగంటి

Anantha Sriram: యూత్ కి ఒక యాంథమ్ లాగా ఉండాలనే రై రై రారా. పాట రాశాం : అనంత శ్రీరామ్

Bandla Ganesh: ఓటీటీ వద్దని సాయి, నితిన్‌కు ఫోన్‌ చేసి థియేటర్‌లో చేయమని చెప్పా : బండ్ల గణేష్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తర్వాతి కథనం
Show comments