Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌ Vs కేంద్ర ప్రభుత్వం.. గెలుపు ఎవరిది?

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (14:00 IST)
ట్రాక్టర్‌ ర్యాలీలో తలెత్తిన హింసాకాండ నేపథ్యంలో.. కేంద్రం గతంలో రైతులకు సంబంధించి గతంలో 250 ఖాతాలను తొలగించాలని కోరిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఖాతాలను పునరుద్ధరించే అంశంపై ట్విటర్‌కు, కేంద్రానికి మధ్య కసరత్తులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఖలిస్తాన్‌ సానుభూతిపరులతో, పాకిస్థాన్‌ మద్దతు కలిగి వుందని ఆరోపిస్తూ.. రైతుల నిరసనకు సంబంధించిన 1200 ఖాతాలపై వేటు వేయాలంటూ కేంద్రం ట్విట్టర్‌ను కోరింది. భారత్‌లో కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న రైతుల నిరసనల దృష్ట్యా విదేశాల నుండి పనిచేస్తున్న ఈ సంస్థల ట్వీట్లతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ట్విటర్‌ను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 
 
రైతు నిరసనలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ట్విటర్‌ ఇంకా ఈ ఉత్తర్వులపై స్పందించలేదని, ఫిబ్రవరి 4న ఈ జాబితాను కంపెనీకి అందించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ట్విటర్‌ సిఇఒ జాక్‌డోర్సే నిరసనకు మద్దతు ఇచ్చిన కొన్ని ట్వీట్లకు మద్దతు తెలపడంతో .. ఖాతాలను తొలగించకపోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తటస్థ వైఖరిపై ట్విటర్‌ ప్రభుత్వం నుండి విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments