Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోన్‌లలో ఎఫ్ఎమ్ రేడియో గోవిందా... ఖర్చు తగ్గించాలని...?

Webdunia
సోమవారం, 8 మే 2023 (15:42 IST)
FM Radio
భారత్‌లో విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లలో ఎఫ్ఎమ్ రేడియో సౌకర్యం కనుమరుగైంది. దీంతో భారత సర్కారు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్లలో తప్పనిసరిగా ఎఫ్ఎ‌మ్ రేడియో వుండి తీరాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్మార్ట్ ఫోన్ కంపెనీలు తలపట్టుకున్నాయి. 
 
దేశంలోని చాలా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ అనేక మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తున్నాయి. కెమెరా, ఇంటర్నెట్, ఫింగర్ సెన్సార్, జీపీఎస్ వంటి అనేక ఫీచర్లతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్లు ఎఫ్ఎమ్ రేడియో సౌకర్యం లేకుండానే విడుదలవుతున్నాయి. ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్‌లలో రేడియో శ్రోతల సంఖ్య తక్కువగా ఉన్నారు. అయితే రేడియోకు అలవాటు పడిన శ్రోతలు ఇంటర్నెట్ ద్వారా ఆన్‌లైన్‌లో రేడియోను వింటున్నారు.  
 
ఇందుకు కారణం ఖర్చులను తగ్గించడానికి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు FM చిప్‌సెట్‌లకు దూరంగా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌లు రేడియోకు దూరంగా వుంటున్నాయి. కానీ ఎఫ్‌ఎం సదుపాయాన్ని తొలగిస్తూ భారత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో, భారతదేశంలో విక్రయించే అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఎఫ్‌ఎం ఫ్రీక్వెన్సీని క్యాప్చర్ చేసే చిప్‌సెట్‌ను అమర్చాలని, ఎఫ్‌ఎమ్ రేడియో సౌకర్యాన్ని అందించాలని చెప్పబడింది. 
 
ఈ ఫీచర్‌ను తొలగించడానికి స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు అనుమతి లేదని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. భారత్‌లో కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఎం రేడియో సేవలను విస్తరిస్తున్న తరుణంలో రేడియో వినే అలవాటును ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమవుతుండడం గమనార్హం. అలాంటి పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్లలో ఎఫ్ఎమ్‌ను సదరు కంపెనీలు తొలగించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments