Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొబైల్‌లో ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్‌కు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం

smartphone
, బుధవారం, 15 మార్చి 2023 (15:30 IST)
మొబైల్‌లో ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్‌కు చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్‌లలో ముందుగా ఇన్ స్టాల్ చేసిన యాప్‎ల ద్వారా ఫ్రాడ్ జరుగుతుందని తెలుస్తోంది. ప్రధానంగా చైనా వంటి దేశాలు ఈ యాప్‌ల ద్వారా దురాక్రమణలకు పాల్పడుతోందనే అనుమానాల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
భద్రతకు పెద్ద పీట వేస్తూ మొబైల్‌లో ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్‌ను తొలగించే దిశగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. కొత్తగా ప్రతిపాదిస్తున్న నిబంధనల ప్రకారం ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను తొలగించి.. ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ అప్టేట్‌లను తప్పనిసరి చేసేలా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలను ఆదేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 
 
అయితే ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను తొలగిస్తే స్మార్ట్ ఫోన్ కంపెనీలకు నష్టాలు వాటిల్లే అవకాశాలు మెండుగా వున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం స్మార్ట్ ఫోన్ తయారీదారులు తమ కొత్త మోడళ్లలో అన్ ఇన్ స్టాల్ చేసే విధంగా ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీతో పొత్తు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు : సోము వీర్రాజు