తెల్లవారితే పెళ్లి.. అక్క భర్తతో లేచిపోయిన వధువు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 8 మే 2023 (15:41 IST)
తెల్లవారితే పెళ్లి ముహూర్తం. ఇంతలో పెళ్లింట వధువు కనిపించలేదు. దీనిపై ఆరా తీయగా ఆమె.. తన అక్క భర్తతో లేచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వధువు, వరుడు కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా గ్రామీణ మండలం కన్నాపూర్ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన 20 యేళ్ల యువతికి మల్యాల మండలం లంబడిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారు. పెద్దలు కుదిర్చిన ముహూర్తం ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు వివాహ వేడుక జరగాల్సివుంది. ఈ వివాహాన్ని వధువు ఇంటివద్దే చేయాలని నిర్ణయించడంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లుచేశారు. తెల్లారితే ముహూర్తం జరగాల్సివుంది. ఇంతలో వధువు ఇంట్లో కనిపించలేదు. వధువు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత వారికి అసలు విషయం తెల్సింది. 
 
పెళ్లిపీటలపై కూర్చోవలసిన యువతి కాస్త.. తన అక్క భర్తతో లేచిపోయింది. మరికొన్ని గంటల్లో పెళ్లి కావాల్సిన తన చెల్లిని కట్టుకున్న భర్త ప్రేమ పేరుతో తీసుకెళ్లడంతో ఆ మహిళ బోరున విలపిస్తుంది. తన భర్త, చెల్లి మధ్య సాగిన ప్రేమ వ్యవహారాన్ని గుర్తించలేకపోవడం తనదే తప్పు అని చెబుతోంది. చివరకు ఈ వివాహం రద్దు కావడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments