Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వదేశానికి తరలిపోతున్న చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (12:47 IST)
సరిహద్దుల్లో నిత్యం కవ్వింపులకు పాల్పడుతున్న పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌లకు భారత తగిన రీతిలో గుణపాఠం నేర్పుతోంది. ఒకవైపు దౌత్యపరంగా ఒత్తిడి తెస్తూనే మరోవైపు, వాణిజ్యపరంగా దెబ్బకొడుతోంది. దీంతో చైనా కంపెనీలు భారత్‌లో నిలదొక్కుకోలేక పోతున్నాయి. ఫలితంగా తమ దేశానికి వెళ్లిపోతున్నాయి. 
 
భారత మార్కెట్‌లో ఉన్న దేశీయ కంపెనీలతో పోటీపడలేకపోతున్నాయి. ఒకపుడు యధేచ్చగా భారత చట్టాలను ఉల్లంఘిస్తూ తమ ఇష్టారాజ్యంగా వ్యాపార కార్యకలాపాలు కొనసాగించిన ఈ కంపెనీల ఆటలు ఇపుడు సాగడం లేదు. పన్నుల కట్టలేకపోతున్నాయి. దీనికితోడు హవానా నగదు చెలామణి బాగా తగ్గిపోయింది. దీంతో దేశీయ మార్కెట్‌కు టాటా చెప్పేస్తున్నాయి. 
 
పనిలోపనిగా తమ వ్యాపార కార్యకలాపాలకు అనువైన దేశాలను వెతుక్కుంటున్నాయి. ఈ క్రమంలో భారత్‌ను వీడే చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇపుడు ఇండోనేషియా, బంగ్లాదేశ్, నైజీరియా దేశాల్లో తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ఈ మేరకు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కూడా కథనాలు ప్రచురించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments